Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla Bhupal Reddy: ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై ప్రతీకా రం

—రెండు మాసాలుగా మానసిక క్షోభకు గురిచేస్తూ కక్షగట్టారు
— మీరు పెట్టింది పసలేని కేసని ప్రజలందరికీ తెలుసు
–మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండు నెలల నుంచి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీర్ ను ప్రతి నిత్యం మానసిక క్షోభకు గురిచేస్తూ దురుద్దేశపూ ర్వకంగా అరెస్ట్ చేస్తామని, జైల్లో పెడతామణి బెదిరిస్తున్నారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొ రేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిలు ఆరోపించారు. ఏడాది కాలం లో ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కక్షగట్టి కేసులు పెట్టడం, జైల్లో పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బిఆరెస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ప్రెస్ లు మీడియా సమా వేశంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా వేల కోట్ల పెట్టుబడు లు తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. అంతర్జాతీయ సంస్థ ను రాష్ట్రానికి తీసుకొచ్చి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా నిర్వహిస్తే అక్రమాలు జరిగాయాంటూ కేసు పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను అన్ని అంశాల్లో ప్రజల తరుపున కేటీఆర్ ప్రశ్నించడాన్ని ప్రభుత్వం సహించలేక పోతుందని విమర్శిం చారు.అందుకే పస లేని కేసు పెట్టిం ది. సాంకేతికంగా కేసులు మీరు పె ట్టొచ్చు కానీ విజ్నులైన ప్రజలు అ న్ని గమనిస్తున్నారని, ఇది అవినీతి కేసు ఎలా అవుతదని, దీనిపై అసెం బ్లీ లో చర్చ జరిపేందుకు ప్రభు త్వం ఎందుకు బయపడుతుందని ప్రశ్నించారు.ప్రభుత్వం నుంచి నేరు గా ఆ సంస్థకు డబ్బులు చెల్లెస్తే అవినీతి ఎలా అవుతుందని, ఈ ఫార్ములా రేస్ ఎందుకు వచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నగరా ల్లో హైదరాబాద్ ఒకటీ కావలన్నదే కేటీఆర్ లక్ష్యమని, అందుకే ఎలక్ట్రి క్ వాహనాల ద్వారా నిర్వహించ డం ద్వారా పర్యావరణ హితం కూడా అవుతుందని వివరించారు.కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ-ఫార్ము లా రేస్ రాష్ట్రానికి వచ్చిందని, రూ. 54 కోట్లతో దీన్ని చేపట్టగా ఈ-ఫా ర్ములా కు కేంద్ర మంత్రులతో పాటు ఎందరో ప్రముఖులు హాజరయ్యార న్నారు. కానీ దీనిపై రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని, అవి నీతి అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇందులో ప్రొసీజర్ లాప్స్ తప్పా ఒక్క పైసా అవినీతి జరగలే దని, డబ్బులు అన్ని సదరు కంపెనీ కి ముట్టాక అవినీతికి ఆస్కారం ఎక్కడిదని, దీనిపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు.

మంత్రిగా కేటీఆర్ పాలసీ డిసిషన్ మాత్రమే తీసుకుంటారని, కానీ ఉద్దేశ పూర్వకంగా అవినీతిని ఆపాదిస్తున్నారని, పైగా ఈ రేస్ ను రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేశారని గుర్తుచేస్తూ ఇది కూడా తెలివి తక్కువ తనమేనని పేర్కొన్నారు. కేటీఆర్ ను జైల్లో పెట్టాలన్న కక్ష్య పూరిత చర్యలు తప్పా ఇందులో మరొక అంశమే లేదని, ఇక్కడ జరిగిందేమి లేదని, నిర్వహించిం ది ప్రభుత్వం, డబ్బులు నేరుగా కంపెనీ కి వెళ్లాయని అయినా కేటీఆర్ పై కేసు పెట్టడం ఏంటని ప్రజలు గ్రహించాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వీటి ప్రాధాన్య త తెల్వదని, దేశ ప్రతిష్ట పెంచడా నికి ఇలాంటి ఈ ఫార్ములా దోహదం చేస్తాయని పేర్కొన్నారు.అసెంబ్లీలో చర్చకు పట్టుపడితే ప్రభుత్వం పారిపోతుందని, కేటీఆర్ నే జైల్లో పెడితే ఇతరులు బయపడుతారని ప్రభుత్వం భావిస్తుందని, కేటీఆర్ పై కేసుతో డైవర్షన్ రాజకీయాలు చే స్తున్నారని, ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీ లు అమలు చేయలేక అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లీస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎన్ని కేసులు పెట్టినా బిఆరెస్ ప్రజల పక్షాన పోరాడడంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు కేసులను చట్టపరంగా ఎదుర్కొనేం దుకు బిఆరెస్ ఎప్పడు సిద్ధoగా ఉందని, ప్రజల తరుపున ప్రభుత్వా న్ని నిలదీస్తూనే ఉంటామని సవాల్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కల్లు గీతా కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్,రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి మాజీ ఆర్వో మాలే శరణ్యా రెడ్డి,జిల్లాగ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లికార్జున రెడ్డి, కొండూరి సత్యనారాయణ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, తిప్పర్తి, నల్లగొండ, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి అయితగోని యాదయ్య… కౌన్సిలర్ మారగోని గణేష్,కో ఆప్షన్ సభ్యులు.. జమాల్ ఖాద్రి,మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి,మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి..సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి,గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి నల్లగొండ మైనారిటీ విభాగం,అధ్యక్షులు అన్వర్ పాషా,తవిటి కృష్ణ కోట్ల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.