Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kattekolu Dipender: బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బడ్జెట్

–బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్

Kattekolu Dipender:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt)ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం 40 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిం చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ (Kattekolu Dipender) ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్ల గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు.ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెం దర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొత్తం 2,91,159 లక్షల కోట్ల బడ్జెట్లో 65 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 9,200 కోట్లు కేటాయించి బీసీల (bc) గొంతుకోసి తీరని అన్యా యం చేశారన్నారు. గత బీఆరెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్ర బీసీల బడ్జెట్ (BC’s budget) తగ్గించుకుం టూనే వచ్చిందన్నారు.

ప్రభుత్వం మారితే బీసీల (bc) బ్రతుకులు మారు తాయని ఆశించినా ఫలితం శూన్యంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మారినా ఈ బడ్జెట్తో బీసీలకు ఒరిగిందేమీ లేదని 65 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు శాతం నిధులు బడ్జెట్లో కేటాయిస్తే ఏవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర సంపద సృష్టించేది, ఉత్పత్తి చేసేది బీసీలని, సగానికిపైగా పన్నులు కట్టేది బీసీలన్నారు. అప్పులేమో బీసీలకు సంపదేమో అగ్రవర్ణాలకా అని ప్రశ్నించారు.

ఈ బడ్జెట్ (Budget)నిధులు రెండున్నర కోట్ల బీసీ జనాభాకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇప్పటికే గ్లోబరైజేషన్ లిబరైజేషన్ (Globalization Liberalization)మార్పుల తర్వాత పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరగడంతో పెద్ద పరిశ్రమలు కంపెనీలు రావడంతో చేతివృత్తులు కులవృత్తులు దెబ్బతిన్న కారణంగా బీసీల బ్రతుకులు రోడ్ల పాలవు తు న్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని 40 వేల కోట్లు కేటాయించి బీసీలపై తమ ప్రభు త్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకో వాలన్నారు. అంతేకాకుండా బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి అమలుచే యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నల్గొండ నియోజక వర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, బీసీ యువజన సంఘం నాయకులు యలిజాల రమేష్, బట్టు శ్రీశైలం, రవీందర్, విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.