–రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసిన మంత్రి కోమటిరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన యుడు ప్రతీక్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవర ణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ రక్తదాన శిబిరానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారం భించి స్వయంగా ఆయన రక్తదా నం చేశారు.
ప్రతీక్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రక్తదానం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తన అభి మానులకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తో పాటు పలువురు కౌన్సిల ర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజ న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రె స్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్త దానం చేశారు.
రక్తదాన శిబిరంలో 200 పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యుఐ, కోమటిరెడ్డి అభిమానులు పాల్గొని రక్తదానం చేసినట్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయ కులు, కార్యకర్త లు,కౌన్సి లర్లు, యువజన కాంగ్రెస్, నాయకులు పాల్గొన్నారు.