–ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు రావాలని పిలుపు
— నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, నల్లగొండ:ప్రభుత్వంతో పాటు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy)అన్నారు. గురువారం అయన నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం శిలార్ మియా గూడెం గ్రామంలో కీర్తిశే షులు రామచంద్రా రెడ్డి, భారతీల జ్ఞాపకార్థం నిర్మించిన లైబ్రరీ, అంగన్వాడీ కేంద్రం, (library ,Anganwadi centre)కమ్యూ నిటీ హాళ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం తోపాటు, దాతలు, స్వ చ్చంధ సంస్థలు ముందుకు రావా లని అన్నారు. ప్రత్యేకంగా పేదలు పైకి వచ్చినప్పు డే అభివృద్ధి సాధ్య మవుతుందని అన్నారు.
గ్రామం లోని యువత, రైతులు, మహిళ లు, అన్ని వర్గాల వారు ప్రపంచం లో జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు లైబ్రరీ నిర్మించ డం, చిన్న పిల్లలకు పౌష్టికాహా రం,విద్యను అందించేందుకు అంగ న్వాడి భవనాన్ని నిర్మించడం, అలా గే గ్రామంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగపడే లా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం అభినందనీయ మని అన్నారు. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టలేదని, ఇలాం టి దాతలు ముందుకు వచ్చినపుడు అభివృద్ధి స్పష్టంగా సాధ్యమవు తుందని తెలిపారు. ఈ సందర్భం గా మంత్రి శిలార్మియా గూడెం గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రక టించడమే కాకుం డా, వారం రోజు ల్లో ఫౌండేషన్ వేస్తామని ,అందుకు అవసరమైన స్థలం చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ సొరంగం పనులు నిలిచిపోయాయని, తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వా త.
ఎస్ ఎల్ బి సి పూర్తికి 2,200 కోట్ల రూపాయలను కేటాయించడ మే కాకుండా, బడ్జెట్లో ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ లో పెట్టించిన ట్లు తెలిపారు. అలాగే బ్రాహ్మణ వెల్లేముల పూర్తికి చర్యలు తీసు కోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీల మేరకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించనున్నామని ఆయన వెల్లడించారు. నల్గొండ జిల్లా సంక్షే మ అధికారిని సక్కు బాయి, ఆర్డీవో (rdo) రవి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.