ఉత్తరభాగం పనులకు పచ్చజెండా ఊపిన ఎన్హెచ్ఏఐ
–ఈ నెల 27నే మొదలు, ఫిబ్రవరి 14వరకు అవకాశం
–161 కి.మీ, 5 ప్యాకేజీలు, రూ.7, 104 కోట్లతో ప్రాజెక్టు
–గిర్మాపూర్ నుంచి రాయగిరి వర కు నిర్మాణానికి టెండర్లు
ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన త ర్వాత ప్రతిష్ఠాత్మకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణ పనులకు టింగ్ టిం గ్ అని గంట మోగింది. ఎప్పటి నుంచో ఎవరెస్ట్ ఎత్తులో ప్రచా రంలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు లో ఎట్టకేలకు కదిలిన ప్రారంభ మైంది. ఈ పనులను ప్రారంభించేం దుకు జాతీయ రహదారుల ప్రాధి కార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్ల ను ఆహ్వానించింది. ఈ నెల 27నే టెండర్లను ఆహ్వానించి వచ్చే ఏడా ది ఫిబ్రవరి 14ను చివరి తేదీగా గడువు విధించింది. ఆ లోపు కాం ట్రాక్టర్లు బిమ్స్, ఈ–టెండర్స్ పోర్ట ళ్లలో టెండర్లను దాఖలు చేయవ చ్చని పేర్కొంది. దాఖలైన టెండర్ల ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటలకు తెరవ నున్నట్టు తెలిపింది.
రూ.7,104 కోట్లతో 161 కిలోమీటర్ల పొడవు రోడ్డును 5 ప్యాకేజీల్లో నిర్మాణం చేసేలా కిలోమీటర్ల వారీగా వివరా లను టెండర్లలో వివరించింది. అంతేకాకుండా ఈ రహదారిని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొంది. అయితే కాంట్రాక్టర్లు తమ టెండర్లను ఫైనాన్షియల్ బిడ్తోపాటు టెక్నికల్ బిడ్ల వారీ గా సమర్పించాలని సూచించింది. ఈ రహదారిని 4లేన్లతో ‘యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ రీజినల్ ఎక్స్ప్రెస్ వే’ విధానంలో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మించనున్నారు. టెండర్లు ఖరార యి, పనులు మొదలుపెట్టినప్పటి నుంచి రెండేళ్ల కాలంలోనే పనుల ను పూర్తిచేయాలని, ఆ తరువాత 5ఏళ్లు రహదారి మెయింట్నెన్స్ కూడా చేయాలని నోటీసులో పొందుపరిచింది.
5 ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణం..
ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం నిర్మాణ పనులను 5 ప్యాకేజీల్లో నిర్మించేం దుకు ఎన్హెచ్ఏఐ టెండర్లలో పేర్కొంది. టెండర్ నోటీసుల ప్రకా రం మొదటి ప్యాకేజీ గిర్మాపూర్ గ్రామం నుంచి మొదలై రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీ టర్లు ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.1,529.19 కోట్లు అవుతుందని తెలుపుతూ టెండర్లను ఆహ్వానిం చింది. రెండో ప్యాకేజీ రెడ్డిపల్లి గ్రా మం నుంచి ఇస్లామాపూర్ వరకు 26 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి రూ.1,114.80 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. మూడో ప్యాకేజీ ఇస్లామాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కి.మీ ఉండగా, ఇందుకు రూ.1,184.81 కోట్లతో టెండర్లను పిలిచారు. నాలుగో ప్యాకేజీ ప్రజ్ఞా పూర్ నుంచి రాయగిరి వరకు 43 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.1,7 28.22కోట్లతో టెండర్లను ఆహ్వా నించారు.
ఇక ఐదో ప్యాకేజీ కింద రాయగిరి నుంచి తంగడ్పల్లె గ్రా మం వరకు 35 కిలోమీటర్లు ఉం టుంది. దీని నిర్మాణానికి రూ.1,5 47.04 కోట్లతో టెండర్లను పిలిచా రు. అన్ని ప్యాకేజీల పనులు ప్రారం భమైన నాటి నుంచి రెండేళ్ల కాలం లో పూర్తి చేయాలని సూచించింది. ఇక ప్రతిపాదించిన ధరల్లోనే యుటి లిటీ షిఫ్టింగ్ చార్జీలను కూడా కలిపి నట్టు తెలిపింది.ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి ఓవైపు టెండర్ల ను ఆహ్వానించినా ఈ మార్గం నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ మాత్రం ఇంకా పూర్తిస్థా యిలో జరగలేదు. ఈ భాగం నిర్మా ణానికి మొత్తం 1895 హెక్టార్ల భూ మి అవసరమవుతుండగా 1862 హెక్టార్లకు 3డీ నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం భూ సేకరణలో ఇప్పటివరకు 90–95 శాతం పూర్తయింది. ఇందులో 1320 హెక్టార్లకు అవార్డుల ప్రకటన జారీ చేయాల్సి ఉంది. మరో 427 హెక్టా ర్లకు సంబంధించి అవార్డుల విచా రణ జరుగుతోంది.
పలు జిల్లాల పరిధిలోని కొన్ని భూముల అంశం కోర్టుల్లో ఉండడంతో వీటి విష యంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తేలలేదు. పైగా అవార్డులు జారీ చేసి, విచారణ జరుగుతున్న భూ ముల పరిహారం విషయంలోనూ ఒక స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో భూముల సేకరణకు ఇచ్చిన ఉత్తర్వులతో తక్కువ ధరకు భూములను కోల్పోవాల్సి వస్తోందని, తమకు అధిక ధరను ఇవ్వాలంటూ రైతు లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం ధర లు పెంచేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. దీని కి సంబంధించి ఎన్హెచ్ఏఐకి కూ డా సమాచారం ఇచ్చిందని, ధరల పెంపు విషయంలో ఆర్బిట్రేషన్కు వెళ్తే అక్కడ పరిష్కారమవుతుం దనే యోచనలో ఉంది.
మరోవైపు రహదారిని మంజూరు చేసినప్పు డు కేంద్రం దీనికి ఎన్హెచ్ నెంబర్ 161ఏఏను కేటాయించినట్టు చెప్పి నప్పటికీ పూర్తిస్థాయిలో నెంబర్ను కేటాయించలేదు. పైగా కేంద్రం నుం చి అటవీ అనుమతులు ఇచ్చి నప్పటికీ ఇంకా పర్యావరణ అను మతులను ఇవ్వలేదని తెలు స్తోంది. దీంతో ఈ మొత్తం అంశాలు పూర్తయ్యాకే రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభంకానున్నట్టు తెలు స్తోంది. అయితే టెండర్లకు ఇచ్చిన గడువు పూర్తయ్యేనాటికి పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేయాలనే యోచనలో కేంద్రం ఉందని అధి కార వర్గాల ద్వారా తెలిసింది.
గతంలోనే మంజూరైనా ఆల స్యం..? కేంద్ర ప్రభుత్వం తెలం గాణకు రీజినల్ రింగు రోడ్డును 2016లో మంజూరు చేసింది. ఆ తరువాత దానిని ఉత్తర, దక్షిణ భాగాలు విభజించింది. తొలుత ఉత్తర భాగం పనుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతోపాటు, దీనిని భారత్మాల పరియో జన–1లో చేరుస్తూ ఎన్హెచ్ ‘నెంబర్ 161ఏఏ’ను కేటాయి స్తున్నట్టు తెలిపింది. కానీ, ఆ తరువాత రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన రాజకీయ గిల్లికజ్జాలతో రహదారి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. రహదారి పనులకు అవ సరమైన స్థాయిలో గత ప్రభుత్వం సహకరించలేదు. ఫలితంగా భూ సేకరణ నుంచి రైతులకు చెల్లిం చాల్సిన పరిహారం ధరల వరకు అన్నీ పెండింగ్లోనే పడ్డాయి. మరో వైపు యుటిలిటీ షిప్టింగ్కు ఖర్చ య్యే రూ.363.63 కోట్ల విషయం లోనూ గత ప్రభుత్వం సరిగా స్పం దించలేదు. మొత్తంగా పనుల్లో ఆల స్యం రాజ్యమేలింది.
ఆ తరువాత రాష్ట్రంలో గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్రెడ్డి, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపారు. యుటిలిటీ చార్జీలు చెల్లించేందుకు కూడా అంగీకరించారు. కానీ, యుటిలిటీ చార్జీలను తామే భరిస్తామంటూ కేంద్రమే భరోసాని వ్వడంతో రాష్ట్రంపై రూ.363.63 కోట్ల ఆర్థికభారం కూడా తప్పింది. ఉత్తర భాగం నిర్మాణానికి రూ.15 వేల కోట్లకు పైగా నిధులు అవసర మవుతున్నాయి. ఇందులో దాదా పు రూ.5,200 కోట్లు భూ పరిహారా నికి చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర వాటాగా రూ.2600 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. ఈ వాటాను పనులు ప్రారం భించే సమయానికి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చింది.
ఈపీసీ పద్ధతే అనివార్యం..
రీజినల్ రింగు రోడ్డు ఉత్తరభాగం రహదారిని ఈపీసీ పద్ధతిలో నిర్మి స్తేనే ఆర్థికంగా లాభదాయ కంగా ఉంటుందని ఈ రోడ్డుపై డీపీఆర్ కోసం ఎన్హెచ్ఏఐ నియమించిన కన్సల్టెన్సీ తమ నివేదికలో పే ర్కొంది. అయితే నివేదికలో బిల్డ్– ఆపరేట్–ట్రాన్స్ఫర్ (బీవోటీ), హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హెచ్ ఏఎం), ఈపీసీ పద్ధతులపై రోడ్డు నిర్మాణం చేపడితే ఎలా ఉంటుం దన్న వివరాలనూ పేర్కొంది. ప్రాజె క్టు కోసం చేసే ఖర్చు, నికర మార్కె ట్ విలువలు, రహదారి నిర్మాణం తరువాత వసూలు చేసే టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని గణిం చిన తరువాతే ఈ పద్ధతుల్లో నిర్మి స్తే లాభదాయకమని వివరించింది.
ఈ విధానాల్లో చేపట్టే నిర్మాణాలకు ప్రభుత్వం కొంతమేర గ్రాంట్ల రూపం లో నిధులను అందిస్తే నిర్మాణం పూర్తయిన తరువాత నుంచి 17ఏళ్లలోనే టోల్ వసూళ్ల రూపం లో ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొంది. కాగా, రోడ్డు నిర్మాణం తరువాత 2027 నుంచి 2046 వరకు (ఆ సమయా నికి రహదారి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తేనే ) దాదాపు రూ.15,768 కోట్లు టోల్ వసూలు ద్వారా రాబడి ఉంటుందని, ఇది ఏటా 5 శాతం చొప్పున వాహనాల పెరుగుదల ఉంటేనే అని నివేదికలో పొందుపరిచింది.
ఇది ప్రజా ప్రభుత్వ విజయం
–మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇది ప్రజా ప్రభుత్వ విజయం
ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం పనులకు కేంద్రం టెండర్లను ఆహ్వానించడం ప్రజా ప్రభుత్వ విజయం. ఇది సీఎం రేవంత్ కృషికి, నా కృషికి దక్కిన ఫలితం. రాష్ట్ర చరిత్రలో సువ ర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఔటర్ రింగురోడ్డు గేమ్ చేంజర్ అయితే ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ చేంజర్ కాబోతోంది. సీఎం రేవంత్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశాం. రాష్ట్ర ప్రభు త్వ ఆర్థిక పరిస్థితిని వివరించాక యుటిలిటీ చార్జీలను కూడా కేంద్ర మే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు గడ్కరీకి ధన్యవాదాలు. రహదారి నిర్మాణా నికి అవసరమైన భూ సేకరణకు సీఎం, నేను కలిసి జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు ఆలస్యమైంది.