Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్

–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేత

Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మండలం పెద్ద సూరారం గ్రామానికి చెందిన ఎన్నారైలు ఏడు దొడ్ల శ్రవణ్ కుమార్ రెడ్డి-సృజన, ఏడుదొడ్ల ఓం ప్రకాష్ రెడ్డి-హిందుల సహకారంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు (Engineering students) శనివారం నల్గొండలో ని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)చేతుల మీదుగా రెండు ల్యాప్ ట్యాప్ లను అందజేశారు. పెద్ద సూరారం గ్రామానికి చెందిన ఇంజ నీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యా ర్థిని జాకటి పూజిత, నల్లగొండకు చెంది న ఇంజనీరింగ్ ప్రథమ సంవ త్సరం విద్యార్థిని గాదే స్ఫూర్తికి ఈ ల్యాప్టాప్లను అందజేశారు.

ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి Chairman Burri Srinivasa Reddy), పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, ప్రతిక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి,నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి (Venkatarami Reddy) తదితరులు పాల్గొ న్నారు.