–రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొండను నవీకరించేందుకు శాయశ క్తు ల కృషి చేస్తుంటే అదే సందర్భంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ విషం చిమ్ము తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)తీవ్రస్థాయిలో మండిప డ్డారు. కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు (KCR, KTR, Harish Rao) నల్గొండ ప్రజలంటే ఎం దుకు అంత కోపమని ప్రశ్నించా రు. మానవత్వం మరిచిన బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మూసీ కాల కూట విషంపై ప్రజలను పక్కదో పట్టించేందుకు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, మీకు అపోహలుంటే మీ మాజీ ఓఎస్డీ ని అడిగి తెలుసు కోండని వ్యాఖ్యానించారు.మాది బుల్డొజర్ పాలన కాదని, ముమ్మా టికి ప్రజాపాలన అని పునరుద్ధాటిం చారు. మూసి సుందరీకరణపై బిఆ ర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్ర చారాన్ని చెప్పుకొంటూ మంత్రి మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకర ణతో పాటు శుద్ధీకరణ చేస్తున్నాం.
నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతుంటే రాక్షసానందం పొందుతున్న కేసిఆర్ ఫ్యామిలి. నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ,రాజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ (MUSSI)వ్యతిరేకులతో పోరాడాల్సి వస్తది.మూసీ పై నాది దశాబ్ధాల పోరాటo, నల్గొండ పట్ల అంత అమానవీయత ఎందుకం టూ ప్రశ్నించారు.ఈసారి అసెంబ్లీకి కేసిఆర్ వస్తే నల్గొండ సమస్యలపై నిలదీస్తామని, మూసీ ప్రక్షాళన పేరుతో కార్పేరోషన్ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ శాసన సభ్యున్ని (Congress legislator)ఛైర్మన్ చేసిన కేసిఆర్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నారు. మూసీ సుందరీకరణ మాత్రమే కాదు కోట్ల మంది బ్రతుకులను కాలుష్యం నుం చి కాపాడే శుద్ధీకరణ.నేను ఇప్పు డు కాదు రెండు దశాబ్ధాలుగా ఫ్లోరై డ్, మూసీ శుద్ధీకరణ మీద పోరా టం చేస్తున్నాను.ప్రధానితో పాటు కేంద్రంలో ఎందరో మంత్రులను కలి సి మూసీ శుద్ధీకరణకు నిధులు కేటాయించాలని వినతులు ఇచ్చా.
నేను తిరగని ఇళ్లు లేదు, నేను కేంద్రంలో (CENTRAL) కలవని నాయకుడు లేడు.వాళ్లు మూసీ బాధితులను తెలంగాణ భవన్ కు పిలిపిం చుకొ ని జనతాగ్యారేజీ అని సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నరు..మీదీ జనతా గ్యారేజ్ కాదు.. జనా న్ని ముంచే గ్యారేజీ, జనాల్ని వం చించే గ్యారేజీ.. అందుకే మీ కారు గ్యారేజీకి పరిమితమైంది.నల్గొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు.. ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా భూఉపరితలంపై ప్రవ హించే జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సం స్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కా నీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదని, ఇది అత్యంత బాధాకరం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకుంటే.. ఈ పదేండ్లలోనూ నల్గొండకు తీరని అన్యాయం జరిగింది.మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రజాధనం వృధాను కేంద్ర జలశక్తి నివేదిక ఇటీవల తేటతెల్లం చేసింది. నల్గొండ భూగర్భంలో ఇంకా ఫ్లోరైడ్ జడలు విప్పుకొని కూర్చుందని తేల్చింది.ఈ మధ్యనే వచ్చిన నదు లనీటి నాణ్యతా ఇండెక్స్ (Quality index) లో మూ సీ రివర్ నీటిలో ఆక్సీజన్ స్థాయి లను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయిలు 1-4 మధ్యన ఉండాలి కానీ ఇది దామరచర్ల దగ్గర 15 గా ఉంది, వలిగొండ దగ్గర 13గా ఉంది, వాడపల్లి దగ్గర 13గా ఉంది. బీఓడి (బయోలాజికల్ ఆక్సీజన్ డిమాండ్) స్థాయిలు 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి.. కానీ వలిగొండ దగ్గర 10.01 శాతం ఉంది.డయేరియా, జ్వరం, చర్మవ్యాధులకు కారణ మయ్యే భయంకరమైన కొలిఫాం బ్యాక్టీరియా తాగునీటి లో అసలే ఉండకూడదు. కానీ.. మన దామరచర్లలో 1400 గా ఉంది. వలిగొండ ప్రాంతంలో 2200 గా ఉంది. వాడపల్లి దగ్గర 1500 గా ఉంది. ఇంత దారుణమైన బ్రతు కులు మనకు ఎందుకు రావా లే.. అందుకే తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు పూనుకున్నది.
మూసీ పరివాహక ప్రాంత పరిధిలో వివిధ కంపెనీలు రసాయన వ్యర్ధాలను (Chemical waste) మూసీలోకి వదిలిపె డుతుండటంతో నది అంతా కాలుష్యంగా మారి నల్గొండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది.వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నదులను శుభ్రం చేసుకొని ప్రజలను వ్యాధు లనుంచి దూరం చేసుకుంటుంటే మన దగ్గర ప్రతిపక్షాలు మాత్రం మూసీ ప్రక్షాళన ఎందుకని గగ్గోలు పెడుతున్నాయి.అయినప్పటికి మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ రేవం త్ రెడ్డి (Revanth Reddy) నల్గొండ జిల్లా ప్రజల జీవి తాలను నరకప్రాయంగా మార్చిన మూసీ కాలుష్యాన్ని శుద్ధి చేసేం దుకు చిత్తశుద్ధితో ప్రయత్ని స్తు న్నారన్నారు. మూసీ విష రసాయ నాలతో ఇప్పటికే అన్నీ కోల్పో యామని, ఇక్కడ పండే పంట లు,కాయగూరల్ని ఎవరు కొనలేని పరిస్థితి. మూసీ తీర ప్రజలంతా మంచినీళ్లు కొనుక్కొని తాగుతు న్నామని ఆందోళన వ్యక్తం చేశారు. శుద్ధి చేయకపోతే మనుషులూ మిగలరని, మూసీ శుద్ధిలో నిరాశ్ర యులయ్యే వారికి అన్ని విధాలుగా ప్రభుత్వ అండగా ఉంటుంది. మూసీ శుద్దిపేరు చెప్పి వెయ్యి కోట్లు మింగిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతులు చెబుతోంది. శుద్ధీకరణ అడ్డుకోవటమంటే.. రైతులు, నిరుపేదలకు మరణశాసనం రాయటమే. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులో మూసీనది ఒడ్డున నెల రోజుల పాటు నివాసం ఉంటే తెలుస్తుంది, ఆ బాధ ఎంటో అని తూర్పారబట్టారు.కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులు. ఇళ్లకు మూసీ తీర ప్రాంత శాపగ్రస్తులను తీసుకువ స్తామని, మూసీ కాలకూట విషం మీద వాస్తవాలు కావాలనుకుంటే.. సీఎం కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేసి న ప్రియాంక వర్గీస్ను అడిగి తెలు సుకోండి. ఆమె ఇటీవలే మూసీపై పీహెచ్డీ చేసింది.మూసీ అంటే ఒక్కప్పుడు రంగారెడ్డి, హైదరా బాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాఢి అని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు మూసీ అంటే ఓ విషం, మూసీ అంటేనే మురికి కూపం…మూసీ శుద్ధి పేరుతో వెయ్యి కోట్లు దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మూసీనది శుద్ధీకరణలో రాజకీయం చేస్తుండటం అత్యం తదారుణమని వ్యాఖ్యానించారు. మూసీ కాలకూట విషం మీద వాస్త వాలు కావాలనుకుంటే, సీఎం కేసీ ఆర్కు (KCR) ఓఎస్డీగా పనిచేసిన ప్రియాం క వర్గీస్ను అడిగి తెలుసుకోండి. ఆమె ఇటీవలే మూసీపై పీహెచ్డీ చేసిందని, కాటేదాన్, పటాన్చె రు,జీడిమెట్ల, కూకట్పల్లి, సనత్ నగర్,ఆజామాబాద్,ఉప్పల్,మల్లాపూర్, నాచారం ఇండ్రస్ట్రియల్ ఏరియాల నుండి విష రసాయ నాలు నేరుగా మూసీలో వదలేయ టం అతి ప్రధాన సమస్య అని వివరించారు.హెచ్ఎండీఏ పరి ధిలోని ఇళ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీళ్లు, వ్యర్థ పథార్థాలన్నీ ఇప్పుడు మూసీలోనే కలుస్తున్నాయి. ఈ విషపు నీళ్లని ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కృష్ణాలో కలుస్తూ అందరికీ విషాన్ని పంచు తున్నా మని విచారం వ్యక్తం చేశారు.
మీ పదేళ్ల పాలన నిర్వాకం వల్ల హైదరాబాద్లో నిత్యం 2000 ఎంఎల్డీల వరకు మురుగు, రసాయనాలతో కూడిన వ్యర్థజ లాలు మూసీలో కలుస్తుందని, మీ పదేళ్ల పాలన నిర్వాకం వల్ల హైదరాబాద్లో నిత్యం 2000 ఎంఎల్డీల వరకు మురుగు, రసా యనాలతో కూడిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తుంది, ఇందులో కేవలం 800 ఎంఎల్డీల నీటినే ఎస్టీపీల ద్వారా శుద్ది చేస్తు న్నారు. మిగతాది శుద్ది లేకుండానే మూసీకి వదులుతున్నారు.రసాయనాలను శుద్ది చేసే ఈటీపీలు లేకపోవటంతో పారిశ్రామిక రసా యనాలన్నీ మూసీలోకి ఆపై పంట పొలాలు, ఆపై పశువులు, కాయ గూరల్లో వచ్చి చేరి మనుషుల శరీరాల్లోకి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నీళ్లను పాల లెక్క మారు స్తామని మూసీ శుద్ధి పేరుతో రూ.1000 కోట్లు దోచుకున్న మీరు, కాంగ్రెస్లో గెలిచిన ఎంఎల్ఏకు మూసీ ఛైర్మన్ పదవి ఆశచూపి దగుల్బాజీ రాజకీయం చేయలేదా అని అడుగుతున్నా అని దుయ్య బట్టారు. మూసీనదిలో కేన్సర్ కా రక ఆర్సెనిక్, క్రోమియం,కాపర్, నికెల్,లెడ్ తదితర రసాయనా లను ఎన్జీఆర్ఐ తన పరిశీలనలో గుర్తించిందని గుర్తు చేశారు.ఈ నీటి తో పండించే పంటలతో బారలోహా లున్నట్లు తేల్చారు. ఇవి తింటే కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. వ్యవసాయ భూ ములు పంటలకు పనికి పరిస్థితి. చెరువుల్లో చేపలు,గడ్డిమేసే పశు వులు, నీళ్లు తాగే పక్షులు సైతం పునరుత్పత్తిని కోల్పోయినట్లు పరిశోధనలు తేల్చాయని వివ రించారు. మూసీ నీటితో పండే పంటల్లో భారలోహాలు(హెవీ మెటల్స్) కారణంగా తింటే..తీవ్ర ఆనారోగ్యం పాలవుతున్నారు. కావాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేసిన ప్రియంకా వర్గీస్ను అడిగి తెలు సుకోండి.. ఇటీవలే ఆమె ఉస్మాని యా యూనివర్సిటీ నుండి మూసీ నదిపై పీహెచ్డీ చేసింది. మూసీపై అనేక పరిశోధనలు చేసిన ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లును కలి సి తెలుసుకుంటే మంచిదని, కాం గ్రెస్ పార్టీ విధానమే బుల్డోజర్కు వ్యతిరేకం. పేదలకు అనుకూ లమ ని, కేసిఆర్, కేటీఆర్, హరీష్రావు లు, మూసీ పీడత ఊళ్లకు రండి మూసీ నది కలుషితం కాని ప్రాం తాల్లోని పరిధిలో ఫాంహౌజ్లు కట్టుకున్న కేటీఆర్,హరీష్రావు, (KTR, Harish Rao,)హైదరాబాద్కు 100 కి.మీ దూ రంలోని ఎర్రవెళ్లిలో సువిశాల ఫాంహౌజ్ కట్టుకున్న కేసీఆర్లు వచ్చి ఒక్క నెల రోజులు మూసీ తీరాన ఉండిపోవాలని కోరుకుం టున్న అని చమత్కరించారు.
మూసీ ప్రక్షాళన కు కమిటీ వేస్తాం. అందులో బీఆర్ఎస్ నేతలకు కూడా చోటు కల్పిస్తమని, 70 వేల పుస్తకాలు చదివిన కేసిఆర్ కు మూసీ గురించి తెలియకపోవడం బాధాకరమని అన్నారు. ఎస్టీపీలు కట్టినమని ప్రచారం చేస్తున్నరు, కేవలం ప్రతిపాదనలు మాత్రమే తయారు చేసి కాలక్షేపం చేశారు.కేటీఆర్ (KTR)అమెరికాలో విద్యాభ్యాసం చేసినా మూసి కాలుష్యం గురించి కొంత తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అగ్గిపెట్టే హరీష్ రావు మళ్లీ రెచ్చగొట్టే పనులకు దిగుతున్నడని, మాది ప్రజా ప్రభు త్వం, ప్రజలకు కనీస ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం అందిం చడం ప్రభుత్వ బాధ్యత, నిజాం ఏడు తరాలు పాలించినట్టు కల్వ కుంట్ల పాలన జరగాలని కేసిఆర్ కన్న కలలు కల్లలకు కావడంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లా డుతున్నరని విమర్శించారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ మూడు జిల్లాలు కాలుష్యానికి గురై ప్రజల యొక్క ఆరోగ్యానికి ఫణం గా పెట్టి పోరాటం చేస్తున్నరు. మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందించినమని ప్రగాల్భాలు పలికిండ్రు, రమ్మనండి నేను నల్గొండలో వాళ్లు చెప్పిన గ్రామానికి తీసుకపోతా, నేనే బ స్సు పెట్టి తీసుకుపోతా, సురక్షిత నీళ్లు ఎట్లొస్తున్నయో తాగించి చూపిస్తా అని తెలిపారు. ఎస్.ఎల్. బీ.సీ టన్నెల ద్వారా ప్రతినెల 400 మీటర్లు తవ్వకం పూర్తి చేసి నల్గొం డ జిల్లాకు సురక్షిత నీళ్లు అందిస్తా మని స్పష్టం చేశారు.డబుల్ బెడ్ రూం లు కట్టి పంచలేక దౌర్భగ్యస్థి తిలో ఉన్న కేటీఆర్, నల్గొండ ప్రజ లమీద విషం చిమ్ముతున్నరు. శ్రీకాంత చారి ప్రాణత్యాగం ద్వా రానే తెలంగాణ వచ్చింది తప్పితే.. ఈ అగ్గిపెట్టే రావో, చావునోట్లో తలపెట్టిన వాళ్ల మామవళ్లనో తెలంగా ణ రాలేదని గుర్తు చేశారు.
ఇదే నల్గొండ జిల్లా నుంచి తొలి దశలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేస్తే.. మలిదశ ఉద్యమంలో నేను మంత్రి పదవికి రాజీనామ చేసి తెలంగాణ వచ్చేంత వరకు మంత్రి పదవి జోలికి పోలేదన్నారు. తెలంగాణ సాధన కోసం నల్గొండ క్లాక్ టవర్ దగ్గర నిరవదిక నిరాహార దీక్ష చేస్తే.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వచ్చి.. దేశమంత నీరే జీవనాధారం అయితే.. నల్గొండకు మూసీ రూపంలో మరణ కారకం అయ్యిం దని ఆవేదన చెందిండు, ప్రపంచ మంతా నదుల చుట్టూ నాగరికత వర్ధిల్లితే.. మూసీ నదిపక్కన మన నల్గొండ జిల్లా నరకయాతన పడు తున్నదని ఆయన దుఃఖ పడ్డడు.
చిన్నపాటి వర్షానికే కార్లు పడవలు అయితున్నయి అన్న కేసిఆర్ కు మూసీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. అన్నిట్లో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులకు ప్రతిదాంటో అవినీతే కనిపిస్తుందన్నారు. అధికారం పోవ డంతో బీఆర్ఎస్ పార్టీ మానవ త్వం మరిచిపోయిందని, ఆనాడు రాజకార్లు, తెలంగాణ కోసం సీమాం ధ్రుల మీద పోరాడినట్టు నల్గొండ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసే రోజు దగ్గర్లో ఉందని హెచ్చరించారు.అసలు కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నల్గొండ ప్రజలంటే ఎందుకు అంత కోపమని అనుకోలేదని చెప్పారు. సబర్మతి నదిని శుద్ధీకరణ చేసు కుంటే కోట్లమంది జీవితాలు మారి నయి, అవసరం లేకున్నా మల్లన్న సాగర్ కట్టి ప్రజాధనం వృధా చేసిన కేసిఆర్ కుటుంబo, ప్రాజెక్టు కట్టి ఐదేండ్లు గడిచినప్పటికి నీళ్లు విడు దల చేయకపోతే, నేను మొన్న అధికారులతో మాట్లాడి యాదాద్రి జిల్లాకు నీళ్లు విడుదల చేయించా నని తెలిపారు.కేటీఆర్ అధికారం లో ఉన్నాన్ని రోజులు విదేశీ టూర్లు, ఫోటోలకు ఫోజులు తప్పా పేదలకు చేసింది ఏముందని, మూ సీ బాధితుల బాధలు తెలియా లంటే ఒకసారి పెద్దఅంబర్ పేట, కుంట్లురుకు వచ్చి వచ్చి మూసీ బాధితులతో ఉండాలి, మూసీ ప్రక్షాళనతో ప్రజలకు సురక్షిత నీరు అంది రోగాలు తగ్గుతాయి, టూరి జం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగు తా యని, మూసీ లో ఇళ్లు కోల్పో తు న్న వారికి అన్ని విధాల న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.