–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ :ప్రేమకు, శాంతికి ప్రతిరూపం క్రిస్మస్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.క్రిస్మస్ సంద ర్బంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
బుధవారం మంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న చర్చి, సెంటేనరీ బిషప్ చర్చిలో, అలాగే క్లాక్ టవర్ వద్ద ఉన్న చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు నిర్వహించు కుంటున్న క్రిస్మస్ కు ఎంతో ప్రత్యే కత ఉందని,క్షమించే గుణం ఉన్న వారు క్రైస్తవులని, వారందరూ పేదలకు ఉచిత సహాయం చేస్తా రని, ప్రేమకు, శాంతికి ప్రతిరూపం క్రిస్టమస్ అని అన్నారు. ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే హింసకుతావులేదని, శాంతి, ప్రేమ మాత్రమే ఉంటుందని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతో షాలతో ఉండాలని అన్నారు. జిల్లా లోని ప్రజలందరూ క్రిస్మస్ వేడుకలను సుఖ, సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
జీసస్ క్రిస్ట్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారని, క్రిస్మస్ సందర్భంగా అందరికి మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి క్లాక్ టవర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, చర్చి ఫాదర్ జోసెఫ్ రెడ్డి, బిషప్, తదితరులు పాల్గొన్నారు.
KomatiReddy VenkatReddy