–వర్షాకాలo ఉంచుకొని ఎప్పటిక ప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయాలి
— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయా లని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) మున్సి పల్ అధికారులను (Muncipal Officers) ఆదేశిం చారు. శని వారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సి పల్ సాధా రణ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిం చనున్న మున్సిప ల్ కౌన్సిల్ హాల్, రికార్డు రూమ్, మరియు రెస్ట్ రూమ్ లకు శంకు స్థాపన చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ మురి కి కాలువల అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడా లని, మురికి కాలువలు పొంగిపొర్ల కుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని, ఎక్కడా మురికి కాలువ లు పూడికతో పూడిపోకుండా పూ డిక తీయించాలని ఆదేశించారు.
ముఖ్యంగా వర్షాకాలం (rainy season) ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని, వీట న్నింటి ని దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచేలా చూడా లన్నారు.అలాగే పట్టణంలో అనాధి కారిక నిర్మాణాలను, ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా ఆక్రమ నిర్మాణా లు చేపట్టినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రఅహ్మద్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ (Councillors, Municipal Commissioner) సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.