Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: సౌకర్యంరిత్యా వేర్వేరు తహశీల్దార్ కార్యాలయాలు

— నల్లగొండ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ పట్టణం , గ్రామీణ ప్రాంతా లకు వేరు వేరుగా తహసిల్దార్ కార్యా లయాల ఏర్పాటు అవ సరమని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు.

ఇందు కుగా ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డిని ఆదే శించారు. మంగళవారం మం త్రి నల్గొండ తహ సిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల కు ఒక్కొక్కరికి లక్ష 116 రూపాయలుల చొప్పున 117 చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో (With media representatives)మాట్లాడుతూ నల్గొం డ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కల్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ (Kalya na Lakshmi Checks Pending) లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్య లు చేపట్టాలని అధికారులను ఆదే శించారు.

నల్గొండ జనాభా 2 రెండు లక్షలు దాటడం, ప్రస్తుత తహసిల్దార్ కా ర్యాలయంపై పని ఒత్తిడి, కనగల్, తిప్పర్తి మండలాల నుండి నల్గొం డ తహసిల్ పరిధిలో గ్రామా లు కలవడం, నల్గొండ జిల్లా కేంద్రం కావటం, వీటన్నింటిని దృష్టిలో ఉం చుకొని నల్గొండ పట్టణం, గ్రామీ ణ ప్రాంతాలకు వేరు వేరుగా తహసి ల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

నల్గొండకు ప్రత్యేక తహ సిల్దార్ కార్యాలయం (Office of Taha Sildar)ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపిం చాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయ ణ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు.ప్రస్తుత తహ సిల్దార్ కార్యాలయాన్ని 25 లక్షల రూపా యల ఎం ఎల్ ఏ ఎస్ డి ఎఫ్ నిధులతో పూర్తిస్థాయిలో ఆ ధుని కరించేందుకు చర్యలు చేపట్టా లని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు, పబ్లిక్ అడ్రస్ సి స్టం, టాయిలెట్స్ తో పాటు, అన్ని గదులను ఆధునికరించడం,ఏ సి సౌకర్యం, అవసరమైన సౌకర్యాలు అన్నింటి ని కల్పించాలని, ఇందు కు అంచనా లను రూపొందించాలని పం చాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా లో ధరణి దరఖాస్తుల (Dharani applications)పరి ష్కారం బాగుంద ని, రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధరణి దరఖాస్తుల పరిష్కారం లో ముందు ఉందని తెలిపారు. ము ఖ్యంగా గత ప్రభుత్వ హయాం నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 27,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, జిల్లా కలెక్టర్ చొరవతో వాటిని పరిష్కరించి ఆ సంఖ్యను 4000 కు తీసుకురావడం జరిగిందని, ప్రతికించి నల్గొండ తహ సిల్దార్ కార్యాలయానికి సంబంధిం చి 1400 దరఖాస్తులలో 1100 ఇదివరకే పరిష్కరించడం జరిగిందని , తక్కినవి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

పని నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవా లని, ఎవరైనా పేదవారికి ఇబ్బంది కలిగించిన ట్లయితే తమ దృష్టికి తీసుకురా వాలని ఆయన చెప్పా రు. గతంలో ధరణిలో అనేక రకాల అక్రమాలు జరిగాయని ,వీటిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభు త్వం సాధ్యమైనంత వరకు సమ స్యలు లేకుండా పరిష్క రించేందు కుగాను ధరణి స్థానంలో భూమా తను తీసుకురావాలని ఆలోచిస్తు న్నట్లు చెప్పారు.

దీనిద్వారా సమ స్యలను సులభంగా పరిష్కరిం చేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఇన్చార్జ్ ఆర్డిఓ స్పెష ల్ డిప్యూటీ కలె క్టర్ శ్రీదేవి, నల్గొండ తహసిల్దార్ శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.