Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: లతీప్ ఉల్లా షా ఖాద్రి ఉర్స్ ఉత్స వాలకు ఎంతో ప్రాముఖ్యత

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: సయ్యద్ లతీప్ ఉల్లా షా ఖాద్రి ఉర్స్ ఉత్సవాలకు ఎంతో ప్రాము ఖ్యత ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మదీనా మజీద్ నుండి ప్రారంభ మైన సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రి (Syed Latip Ulsha Qadri)గంధం ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మీడి యా ప్రతినిధులతో మంత్రి మాట్లా డుతూ కష్టాలు ,ఆపదలో ఉన్నవా రు మొక్కుకొని దర్శించుకునే సయ్యద్ లతీపుల్ల షా ఖాద్రి దర్గాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. వారం రోజులపాటు జరుగుతున్న సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రి ఉర్స్ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అన్నారు.

ఈ ఉర్స్, దర్గా భివృద్ధిలో భాగంగా గతంలో గుట్ట పైకి వెళ్లేందుకు మెట్లు, కమాన్, ఇతర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. హిందూ, ముస్లింలు (Hindu and Muslim)కులమతాలకతీతంగా గుట్టపైకి వెళ్లి సయ్యద్ లతీప్ ఉల్లాషా ఖాద్రి (Syed Latip Ulsha Qadri) ని దర్శించుకునేందుకు త్వరలోనే సుమారు 30 కోట్ల రూపాయల తో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఇన్చార్జి ఆర్ డి ఓ శ్రీదేవి, డిఎస్పి శివరాం రెడ్డి,తహసీల్దార్ శ్రీనివాస్ ఇతర అధికారులు ముస్లిం మత పెద్దలు తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.