–పంద్రాగస్టులోపు ఊహాజనితాల ను పటాపంచలు చేస్తూ రుణమాఫీ
–ఆగస్టు 15 వ తేదీ లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్దం
–నల్లగొండ డిసిసిబి చైర్మన్ గా కుం భం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో ఇది ఇందిరమ్మ రాజ్యమని, రైతు ప్రభుత్వo కొనసాగుతోందని, పంద్రా గస్టులోపు ఊహాజనితాలను పటా పంచలు చేస్తూ అన్న మాట ప్రకారo ఆగస్టు 15 వ తేదీ లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్దంగా ఉన్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) పేర్కొన్నా రు. ఆగస్టు 15వ తేదీలోపు 32 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీని (Loan waiver) చేయబోతున్నామని స్పష్టం చేశా రు.తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు పక్షపాతి అని ఉద్ఘాటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గా మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుం భం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికై ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి వెంకటరెడ్డి (Venkata Reddy) పాల్గొని నూతన చైర్మ న్ శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలి పారు.
వేదమంత్రాల సాక్షిగా అర్చకుల ఆశీర్వచనాలతో దగ్గ రుండి డిసిసిబి చైర్మన్ చైర్మన్ సీటు లో కూర్చోబెట్టారు మంత్రి. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 200 4లో కాంగ్రెస్ పార్టీ (Congress party) వైయస్సార్ రుణ మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టిం చాడని గుర్తు చేశారు.ఏడు లక్షల కోట్ల అప్పు ఉండి కూడా మా ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతులకు రుణమాఫీ చేయడానికి కృత నిశ్చయంతో ముందుకు సాగు తున్నాడని తెలిపారు.పైసా పైసా పోగేసి రైతులకు సహాయం చేయ డానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా మని వివరించారు. యావత్ తెలం గాణ రైతులకు తమ కాంగ్రెస్ ప్రభు త్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భువనగిరి ఎన్నికల ముఖ్య పాత్ర పోషించి శ్రీనివాస్ రెడ్డి డిసిసి బి చైర్మన్ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించిన రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నాలుగున్నర ఏళ్లలో మీకు అండగా ఉండి మీ గుండెలో స్థానం సంపా దించుకునే విధంగా మా పరిపాలన ఉంటుందని అన్నారు. నూతన చైర్మన్ గా ఎన్నికైన కుంభం శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) రైతుల మనుసుల్లో స్థానం సం పాదించి ముందు ముందు మంచి మంచి పదవుల్లో రాణించాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్య క్తం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజె క్టు, ఏఎంఆర్పి ప్రాజెక్టుల కింద లక్షల మంది రైతులు బత్తాయి రైతులు ఉన్న జిల్లాగా నల్గొండ జిల్లాకు పేరుoదని గుర్తు చేశారు. నాతో పాటు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సహకారం సంపూర్తిగా ఉంటుందని అన్నారు. పదవి వచ్చిన తర్వాత పదవికి న్యా యం చేయాలని, పదవి ఎన్ని రోజు లు ఉన్నది అనేది ముఖ్యం కాదని, రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో రైతు సమస్యల పైన అందుబాటులో ఉండి పనిచే యాలని సూచించారు. నూతన చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నన్ను ముందుడి నడిపిం చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క డైరెక్టర్ కి, మిత్రులకు, శ్రేయో భిలాషులకు పేరుపేరునా ధన్యవా దాలు వెల్లడించారు.రైతుల సంక్షేమ మే ధ్యేయంగా ముందుకు వెళ్తా మని, రైతు పక్షపాతిగా పని చేస్తానని హామీ ఇచ్చారు.