Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకరండి

–సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
–గ్రామాల్లో తాగు నీటి సమస్యలు ఉత్పన్నం కావద్దు
–అధికారులు అప్రమత్తమై అనుక్షణం పర్యవేక్షించాలి
–నల్లగొండ మండల పరిషత్ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న నాలుగున్నర సంవత్సరాలలో నల్గొండను అన్ని రకాలుగా అభి వృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. సోమవారం అయన నల్గొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో (conference hall) నిర్వహిం చిన మండల పరిషత్ సర్వ సభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ అంశాలపై జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముందుగా తాగునీటి సరఫరా పై (Drinking water supply) సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామంలో తాగునీటికి సమస్య ఉండకూడ దని, ఎక్కడైనా సమస్యలు ఉన్నట్ల యితే తన దృష్టికి తీసుకురావా లని, ఇది వరకే నల్గొండ నియోజక వర్గంలోని గ్రామాలలో తాగు నీటి సమస్యను తీర్చేందుకు తన ఎస్డిఎ ఫ్ నిధుల నుండి కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇంకా అవసర మైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు.

ఎక్కడైనా సమస్యలు ఉంటే ముందే తన దృష్టికి తీసుకు రావాలని, తాగునీటిపై పది రోజుల కు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని, అన్ని గ్రామాలలో అదనపు తాగునీటి ట్యాంకుల (Drinking water tanks) నిర్మాణం, ఓహెచ్ఎ స్ఆర్ లు, పైప్ లైన్లు అదనంగా ఎక్కడైనా అవసరమైతే మిషన్ భగీరథ (Mission Bhagiratha)అధికారులు చర్యలు తీసుకోవా లని, ప్రతిపాదన సమ ర్పించాలని చెప్పారు.మూడు, నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెళ్లెము ల ప్రాజెక్టుకు సాగునీరు తీసుకొస్తా మని, అలాగే ఎస్ ఎల్ బి సి సొరం గం పనుల పూర్తికి రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడి 2000 కోట్ల రూపాయలు మంజూరు చేయించ డం జరిగిందని, ఇటీవల తను అమెరికా వెళ్లి ఎస్ ఎల్ బిసి టన్నెల్ నిర్మాణానికై రెండవ మిషన్ సైతం తెప్పించడం జరిగిందని, ఎస్ఎల్బీసీ నిర్మాణం పూర్తి,ఏ ఎం ఆర్ పి కాలు వల లైనింగ్, బ్రాహ్మణ వెల్లేములను పూర్తి చేయడమే ధ్యేయమని అన్నారు. నల్గొండ నియోజకవర్గం (Nalgonda Constituency) వైపు ఎవరు వేలు పెట్టి చూపించ కూడదని ఆయన పేర్కొన్నారు. ముందుగా బ్రాహ్మణ వెల్లేముల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటి ఇవ్వాలనినిర్ణయించామని,ఇందులో భాగంగా ముందుగా 50,000 ఎకరాలకు సాగునీరు అందించను న్నట్లు బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ఎస్ ఈ గంధం శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. భూసేకరణకు సంబంధించి రైతులు సహకరిస్తే డిసెంబర్ లోపు సాగునీటిని అందిస్తామని ఆయన తెలిపారు.విద్యుత్ సమీక్ష సందర్భం గా నల్గొండ నియోజక వర్గంతో పాటు, జిల్లా వ్యాప్తంగా అవసరమై న కొత్త సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల షిఫ్టింగ్ వంటి వాటికి ప్రతిపా దన సమర్పించాలని, వారం, పది రోజుల్లో మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు .బడ్జెట్ కు ఎలాం టి ఇబ్బంది లేదని ఆయన అన్నా రు. ట్రాన్స్ఫార్మర్ల విషయంలో రైతుల వద్ద నుండి ఎవరైనా డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు.

విద్యుత్ మెటీరియల్ (Electrical material)తో పాటు సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ సిప్టింగ్ కి ప్రతిపాదన సమర్పించా ల్సిందిగా విద్యుత్తు ఎస్ ఈ చంద్ర మోహన్ (Chandra Mohan)ను ఆదేశించారు. ఏ గ్రామంలో రైతులు ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది పడకూడ దని చెప్పారు.అంగన్వాడి భవనాల పై నిర్వహించిన సమీక్ష సందర్భం గా నియోజకవర్గ పరిధిలో 55 నూతన అంగన్వాడి భవనాలు కావాలని ఐసిడిఎస్ సిడిపిఓ నిర్మల తెలుపగా అద్దే భవనాల్లో ఉన్న వాటన్నిటికీ, ప్రతి అంగన్వాడికి ప్రభుత్వ భవనాలు ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని ,అలాగే ఫ్యాన్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి అన్నారు.3 మండలాల్లో మూడు నాలుగు నెలల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. చిన్న పిల్లలు ,గర్భిణీ స్త్రీలు, మహిళలకు సరైన విధంగా పౌష్టికాహారం అందించాలని, అలాగే గుడ్లు ,ఐరన్ మాత్రలు అందేలా చూడాల్సిన అవసరం ఉందని, పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తెచ్చే బాధ్యత ఆయాలపై, అంగన్వాడీ టీచర్ల (Anganwadi teachers)పై ఉందని అన్నారు.పంచాయతీరాజ్ పై సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లా డుతూ రానున్న అయిదారునెలల్లో అన్ని గ్రామాలు, చిన్నచిన్న గల్లీలలో సైతం సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణాల ను చేపట్టేలా గ్రామాల వారిగా అంచనాలను తయారు చేయాలని పంచాయతీరాజ్ (Panchayati Raj) ఎస్ ఈ తిరుపతయ్యను ఆదేశించారు. ఎక్కడ గ్రామాలలో ఓపెన్ డ్రైన్స్ ఉండకూడదని అన్నారు. అలాగే గ్రామాలలో ఉన్న పాటుబడిన బావులను సైతం పూడ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.పశు సంవర్ధక శాఖపై జరిగిన సమీక్ష లో భాగంగా నల్గొండ నియోజకవర్గంలో ఉన్న అన్ని పశు సంవర్ధక ఆసుపత్రిలో టాయిలెట్స్ (toilets)కావాలని కోరగా తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

వైద్య, ఆరోగ్యశాఖ (Medical and Health Department) సమీక్ష లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్న (Primary Health Center)చోట కంప చెట్లను తొలగించి నీరు నిల్వ ఉండకుండా మొరం కొట్టించాలనిమంత్రి అన్నారు. పి హెచ్ సి డాక్టర్ తో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు వస్తున్నాయా రోగులు కూర్చునేందుకు సౌకర్యాలు ఉన్నాయా అని అడిగారు.ఆర్ అండ్ బి సమీక్ష సందర్భంగా నూతనంగా నిర్మాణం చేపట్టే రోడ్లు ఎక్కడ టర్నింగ్ లేకుండా చూసుకోవాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులను పంపనుందని, ఇందులో భాగంగా జిల్లాకు 20 ఏసి బస్సులను కోరడం జరిగిందని ,అంతేకాక ఆర్డినరీ బస్సులు అడిగామని, హైదరాబాద్ కు నాన్ స్టాప్(non stop) బస్సుల సంఖ్య పెంచాలని, తిరుపతికి ఏసీ బస్సులు నడపాలని, యాదగిరిగుట్ట కి అలాగే ఇతర డిమాండ్ ఉన్న ప్రాంతాలకు గ్రామాలకు సైతం ఆర్డినరీ బస్సులు నడపాలని, నూతనంగా ఆర్ ఎం గా విధులలో చేరిన రాజశేఖర్ ను ఆదేశించారు.తెలంగాణలో ఆర్ అండ్ బి రహదారుల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్- విజయవా డ జాతీయ రహదారిపై టోల్గేట్లు సంబంధించిన టోల్ ఫీజు వసూలు చేసే జిఎంఆర్ కాంట్రాక్టు రద్దు చేయడం జరిగిందని, మల్కాపూర్ వరకు 6 లైన్ల రహదారిని పూర్తి చేసామని ,రాష్ట్రాన్ని, ప్రత్యేకించి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆయన అన్నారు.ఈ సమావేశానికి ఏ ఎమ్ అర్ పి ఎస్ ఈవెంకటేశ్వర్ రావు, సీఈ నాగేశ్వరరావు, ఎంపిపి , వైస్ ఎంపీపీ పరమేష్, జడ్పిటిసి లక్ష్మన్న, ఆర్డబ్ల్యూఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ చంద్రమోహన్, పంచాయతి రాజ్ ఎస్ ఈ తిరుపతయ్య, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, ఎంపీడీవో ఎస్. వెంకట్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు హాజరయ్యారు.