–కేవలం వ్యవసాయరంగానికి రూ. 72,659 కోట్లు సాక్షాత్కారం
–రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు కేటాయింపు జరిగింది
–రాష్ట్ర బడ్జెట్ పై రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి రైతు ప్రభుత్వమని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)పేర్కొ న్నారు. ఆర్ధిక మంత్రి భట్టి విక్ర మార్క ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్టే (budget) అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేవలం వ్యవసా యరంగానికే రూ. 72,659 కోట్లు సాక్షాత్కారమని,రుణమాఫీకి (Loan waiver) కూడా రూ. 31 వేల కోట్లు కేటాయింపు చేయడం జరిగిందన్నారు. శుక్ర వారం నల్లగొండ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నకిరేకర్ శాసన సభ్యులు వేముల వీరేశంతో కలిసి మాట్లాడారు.దక్షిణ తెలంగాణలోని ప్రాజె క్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు చేయడం జరిగిం దన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం, శివన్న గూడెం, బ్రాహ్మణ వెల్లేముల, పాలమూరు, రంగారెడ్డి ,సీతారామ వంటి ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ నిధులు కేటాయింపు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమ న్నారు.పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధికి రూ. 29 వేల కోట్లు, ఆర్ అండ్ బి కి రూ. 7,315 కోట్ల కేటా యింపు చేశామని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో (In the central budget)రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన ప్పుడు రూ. 75577 కోట్లు రూ పాయల మిగులు ఉండేదని, డిసెంబర్ 3, 2023 న 6,713 57కోట్ల రూపాయలతో అప్పుల రాష్ట్రంగా గత ప్రభుత్వం అప్పగిం చిందని గుర్తు చేశారు. మొత్తంగా రూ. 37 వేల కోట్ల రూపాయలు ఇందిరమ్మ 6 గ్యారంటీలకు అమ లుకు పెట్టడం జరిగిందన్నారు. ఒక టో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇస్తూనే ఉన్నాన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు,వడ్డీ కలిపి రూ. 42 వేల కోట్లు చెల్లించా మని చెప్పారు. రైతులకు (farmers)ఇచ్చే 12 వేల రూపాయలను త్వరలోనే అమ లు చేస్తాన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్నడూ రూ. 72,000 కోట్లు రూపాయలు కేటాయించలేదన్నారు. దేశ చరి త్రలోనే వ్యవసాయానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏది లేదని స్పష్టం చేశారు.పది రోజుల్లో బ్రాహ్మణ వెల్లేముల ట్రయల్ రన్ (Brahmin Vellemula trial run)నిర్వహిస్తామని, డిసెంబర్ లో కాలు వలను పూర్తి చేస్తామని, ఎస్ఎల్ బిసీ సొరంగం పనులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు అమెరికా నుండి కొత్త మిషన్ లు తెప్పిం చనున్నామని, సాధ్యమైనంత త్వరగా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తామని వెల్లడించారు.
నల్గొండ లోని ప్రాజెక్టులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి (Palamuru-Ranga Reddy)పనులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అసెం బ్లీ నియోజకవర్గంలో రూ. 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో సమీ కృత వసతి గృహాల నిర్మాణం చేప డుతున్నామని అన్నారు. స్కిల్ డెవ లప్మెంట్ యూనివర్సిటీకి రెండు నెల ల్లో టెండర్లు పిలువనున్నామని, రూ. 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఐబీఎం తరహా లో దీనిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.