Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy: రోడ్డు ప్రమాద బాధితునికి ఆర్థిక సహాయం

–స్థానిక కౌన్సిలర్ ద్వారా మంత్రి కోమటిరెడ్డి ఔదార్యం

Komatireddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రోడ్డు ప్రమాదం బాధితుని కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి (Komatireddy)వెంకటరెడ్డి ఆర్థిక సాయం అందించారు. నల్లగొండ పట్టణంలోని పానగల రోడ్డు లో గల 19 వ వార్డు శ్రీ నగర్ కాలనీ కీ చెందిన పోలేపల్లి గోపి చందు కీ ఇటీవల బైపాస్ రోడ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో (road accident) తీవ్రంగా గాయ పడ్డారు. సదరు విషయం 19 వ వార్డు కౌన్సిలర్ గోగుల రాముల మ్మ గణేష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి దృష్టికి సమాచారం అందిచగా విషయం తెలుసుకున్న మంత్రివ ర్యులు నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (Burri Srinivas Reddy),పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి లతో రూ. 20 వేలు ఆర్థిక సహాయం పంపించడం జరిగింది.శ్రీ నగర్ కాల నీ కౌన్సిలర్ గోగుల రాములమ్మ గణేష్ సదరు సహాయాన్ని బుద వారం బాధితుని ఇంట్లో గోగుల గణేష్, నరేష్,సతీష్, శ్రీకాంత్, అశ్వి న్ బృందంగా వెళ్లి ఆర్థిక సహాయం ను అందజేయడం జరిగింది.