Konda Laxman Bapuji: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) స్ఫూర్తితో పవర్లూమ్ కార్మికుల సమ స్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ )జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) 109వ జయంతి సందర్భంగా పాలకేంద్రం ఎదురు గల ఆయన విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల (Poor, downtrodden, underprivileged and weaker sections)అభ్యున్నతి కోసం చట్టసభల్లో, వెలుపల న్యాయస్థానాల్లోనూ గొంతెత్తిన సామాజిక దర్శినికుడు అని కొనియాడారు. 1940లో ఆంధ్ర మహాసభలో చేరి క్రియాశీలక పాత్ర (Active role)నిర్వహించారని అన్నారు. తన మరణాంతం వరకు తెలంగాణ సాధన కోసం బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన నేత అని కొనియాడారు ఆయన ఉద్యమస్ఫూర్తితో తెలంగాణలో పవర్లూమ్ కార్మికుల హక్కుల రక్షణ కోసం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (Power Loom Workers Union) (సిఐటియు) పద్మనగర్ ఏరియా అధ్యక్షులు గంజి నాగరాజు, జిల్లా ప్రచార కార్యదర్శి పసునూరి యోగానందం , పద్మ నగర్ ఏరియా కార్యదర్శి సూరపల్లి భద్రయ్య ,గంజి గిరి పసునూరి రాములు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.