Women employees protest ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలక్టరేట్ ముందు 21 వ రోజు మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గురీ కృష్ణ బొమ్మగానీ రాజు మాట్లాడుతూ గత 21 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వెంటనే స్పందించి సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ అయిన రెగ్యులర్ నీ నెరవేర్చాలని కోరారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు మా మద్దతుగా మా పనులు చేయకుండా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎమ్ నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత , సాయిలు , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, జానయ్యా, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.