–కుల వివక్ష వ్యతిరేక పోరాట సం ఘం కార్యదర్శి స్కైలాబ్ బాబు
KVPS: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమా జంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ నిమ్న జాతులను అణిచివేయుటకు ఆ యుధంగా ఉన్న మనుధర్మ శాస్త్రం కుల సమస్య (Caste problem) దేశంలో నిర్మూలన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుల వివక్ష వ్యతిరేక పోరా ట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపెట్ల స్కైలాబ్ బాబు అన్నారు. కెవిపిఎస్ (KVPS)నల్లగొండ జిల్లా స్థాయి సామాజిక శిక్షణా తరగతుల 26,27 ఎం వి ఎన్ ట్రస్ట్ భవనంలో జరుగు తున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ దేశంలో 6486 కులాలు 28 వేల ఉపకులాలు ఉన్నాయని అన్నారు. తరతరాలుగా మన స్మృతి మనుధర్మ శాస్త్రం ఆధా రంగా మనిషిని మనిషిగా చూసే పరిస్థితి లేదన్నారు.
కులం పేరా దాడులు దౌర్జన్యాలు (Caste paragraph attacks are atrocities) పెరిగిపో యాయని ముఖ్యంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత రాజ్యాంగాన్ని తొలగి స్తామని మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని చెబుతూనే దళిత గిరిజన ప్రజల పైన దాడులు చేసి హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్లను దండలేసి ఊరేగింపులు చేయడం అంటే ఎంత కులోన్మాద భావజాలం గల ఆర్ఎస్ఎస్ మూలాలేనని అన్నారు. నేడు విద్య వైద్యం పేదలకు అందడం లేదని సంక్షేమ రంగాలపైన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) భారత రాజ్యాంగ పలాలను ప్రతి పౌరుడు అందుకునే నిజమైన రోజు రావాలంటే దేశంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలని అన్నారు.
కెవిపిఎస్ (KVPS) జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్(DEMAND) చేశారు. దళిత బంధు ఇండ్లు ఇండ్ల స్థలాలు విదేశీ విద్యా నిధి పథకం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల దళిత గిరిజనుల పైన దాడులు పెరిగాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు (GOVT)విఫలం చెందుతున్నాయని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ సమస్యలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అన్నారు. హాస్టల్ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి ఉద్యమాల నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ స్కూల్స్ (PRIVATE SCHOOLS)విచ్చలవిడిగా వెళువాడు తున్నాయని వాటి నియంత్రించడంలో జిల్లా అధికారులు వైఫల్యం చెందారని అన్నారు. అనుమతులు లేని హాస్టల్లో ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని కోరారు. ఈ సందర్భంగా సుభాష్ విగ్రహం దగ్గర కెవిపిఎస్ జెండాను రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు ఆవిష్కరించారు. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా కెవిపిఎస్ (KVPS)జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పరుశరాములు, జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్ ,బొల్లు రవీందర్ ,పెరికే విజయకుమార్ ,ఒంటెపాక కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు దంతాల నాగార్జున, బొడ్డు బాబురావు, చిలుముల రామస్వామి, దండు రవికుమార్, దేవయ్య, తక్కెళ్ళపల్లి శ్యామ్, మల్లయ్య, లక్ష్మీ తదితరు లు పాల్గొన్నారు.