Macharla Rambabu: ప్రజాదీవెన, నల్గొండ టౌన్: జాతీయ యువజన దినోత్సవాలు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యూనివర్సిటి ఓఎస్డీ ప్రొఫెసర్ అంజిరెడ్డి మరియు సౌమిత్రి లక్ష్మణా చార్య ద్వీప ప్రజ్వలన చేసి ప్రారంభించగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ… “దేశభక్తులను తయారు చేసే కర్మాగారం ఏబీవీపీ అని ఈ దేశంలో అనేక విద్యార్థి సామాజిక ఉద్యమాలను నిర్మించి విజయతీరాలకు చేర్చిన ఘనత ఎబివిపి ది అని అన్నారు వివేకానందుని స్ఫూర్తితో యువకులను జాతీయ పునర్నిర్మాణం వైపు నడుపుతున్న సంస్థ ఏబీవీపీ అని వివేకానందుడు చూపిన దారి ఆదర్శనియమని వివేకానంద స్ఫూర్తితో యువత ఈ దేశాన్ని విశ్వ గురువుగా మలచటంలో పాత్రులు కావాలని పిలుపునిచ్చారు” .
ఈ దేశం ప్రపంచానికి మానవ వనరులను అందించే పరిశ్రమని ఆర్థిక సామాజిక శాస్త్ర సాంకేతిక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో యువతను విదేశీ భావజాల శక్తులు నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నాయని వాటికి యూనివర్సిటీ క్యాంపస్లను వేదికగా చేసుకుని ప్రణాళికలు రచిస్తున్నాయని అన్నారు, వీటిని తిప్పి కొట్టడం ఈ దేశ పౌరులుగా మన బాధ్యత అని లేకపోతే మరోసారి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని పాశ్చాత్య దేశాలతో కలిసి ఇక్కడి శక్తులు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అడవుల్లో రక్తాన్ని పారించి తుపాకీ గుండు ద్వారానే ప్రజాస్వామ్యం పరిణవిల్లుతుందని చెప్పిన కమ్యూనిస్టులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తడానికి అర్హులే కాదన్నారు, దేశం కోసం పనిచేయడానికి ఈ దేశ సైన్యంలో చేరాలని లేదంటే ఏబీవీపీ లో చేరి ఈ దేశ సేవకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రంలో ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ రాష్ర్ట కార్యా సమితి సభ్యులు సామల అఖిల్ రెడ్డి రాష్ట్ర విశ్వవిద్యాలయాల కో కన్వీనర్ మౌనేష్ చారి రాష్ట్ర స్పోర్ట్స్ కో కన్వీనర్ రాజేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ సాయి, సూర్య , విజయ్, వెంకటేష్, నందిని, శివ తరుణ్, దినేష్, రాజు, రాము , విజయ్, సంపత్, వినేయ్ తదితరులు పాల్గొన్నారు.