Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University: సమకాలీన సవాల పరిష్కారానికి కృత్రిమ మేధ అవకాశాల స్వర్గధామం: ఆచార్య కృష్ణ

Mahatma Gandhi University: ప్రజాదీవెన, నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ మరియు ఎంసీఏ విద్యార్థులకు కృత్రిమ మేధస్సు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డీప్ లర్నింగ్ మెథడ్స్ పై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు ఆచార్య కృష్ణ మరియు సిబిఐటి కళాశాల అధ్యాపకులు డా లక్ష్మి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వి సుకన్య విచ్చేసి ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆచార్య కృష్ణ మాట్లాడుతూ ఇంటర్నెట్ అనుసంధానంతో ప్రాజెక్టుల రూపకల్పన, సమకాలీన అంశాలల్లో కృత్రిమ మేధ వినియోగం, ప్రాజెక్టుల రూపకల్పన, మరియు ఆరోగ్య రంగాలలో కృత్రిమ మేధా మరియు మెషీన్ లర్నింగ్ల వినియోగంపై ప్రసంగించారు. డా లక్ష్మి శ్రీనివాసరెడ్డి కృత్రిమ మేధ మరియు డీప్ లర్నింగ్ నమూనాలు వాటి ద్వారా పరిష్కార మార్గాలపై విద్యార్థులకు వివరించారు.

భూగర్భ జలాలు పశుపక్షాదుల పెంపకం, వ్యవసాయం వంటి రంగాలలో వీటిని విరివిగా వినియోగించే అవకాశాలపై పరిశోధనలు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, విభాగ అధిపతి డా జయంతి, డా హరీష్ కుమార్, డా సంధ్యారాణి, సిహెచ్ స్వర్ణలత, జ్యోతి రాణి, రాజేశ్వరి దుర్గాప్రసాద్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.