Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University: గణిత విభాగంలో ఇండక్షన్ ప్రోగ్రాం

ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం లోని గణిత విభాగ అధిపతి డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన ఎమ్మెస్సీ గణిత విభాగ విద్యార్థినీ విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రేమ్ సాగర్ హాజరయ్యారు. గణిత విభాగ అధ్యాపకులు డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, డాక్టర్ డి హైమావతి, డాక్టర్ ఏ శ్రీనివాస్ మరియు డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్ లు ప్రసంగిస్తూ పీజీలో ఘణితాన్ని ఎంచుకోవడం వల్ల ఉన్న లాభాలను కోర్సులో ఉండే సబ్జెక్టుల విషయాలను విద్యార్థులకు అందుబాటులో ఉండే పుస్తకాలను ఒక్కొక్కరుగా వివరించడం జరిగింది.

విభాగాధిపతి డాక్టర్ మద్దిలేటి పసుపుల మాట్లాడుతూ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులుగా మీరు చదువులో రాణిస్తూనే మిగతా రంగాలలో అనగా స్పోర్ట్స్ బోర్డ్ ద్వారా క్రీడల్లో, ఎన్ఎస్ఎస్ ద్వారా నాయకత్వ,సామాజిక సంస్కృతిక లక్షణాలను మరియు లైబ్రరీకి వెళ్లడం ద్వారా సమాజం పట్ల మరియు మీ సంబంధిత సబ్జెక్టుల పట్ల విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు అని అదేవిధంగా సి ఎస్ ఐ ఆర్ , టీజీ సెట్ మరియు జేఎల్డీఏలు తదితర పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం గణిత విభాగంలో అందుబాటులో ఉన్నది. యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని సూచించాడు.

హుజూర్నగర్ కు చెందిన కస్తాల రమేష్ అనే పూర్వ విద్యార్థి అనేక రకమైన కష్టాలను అధిగమించి ఈరోజు జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం పొందినాడు. రమేషు ఆర్థిక సామాజిక అవరోధాలను దాటుకుంటూ తన అనుకున్న లక్ష్యాలను చేరేవరకు విశ్రమించకుండా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించిన కష్టాల రమేష్ ను సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గణిత విభాగ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో గణిత విభాగం లోని వివిధ ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థు లను కలుపుకొని అల్ముని గణిత విభాగ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటి సమావేశము ఏర్పాటుచేసి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కు మార్గదర్శనం చేస్తాము.