–మహిళలకు భద్రత కల్పించాలి
–ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
Mallu Lakshmi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్రంలో విచ్చలవిడిగా వెలసిన బెల్ట్ షాపుల్లో ఎత్తివేయాలి మాదకద్రవ్యాలను నిషేధించి మహిళలకు భద్రత (Safety for women) కల్పించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (Mallu Lakshmi)ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు దొడ్డి కొమరయ్య భవనంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం కొండ అనురాధ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో బాలికలు మహిళల పైన రోజు రోజుకి లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అగత్యాలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను (Six guarantees)అమలు చేస్తామని చెప్పి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు కల్పించడం సంతోషము కానీ గతంలో 3800 బస్సులు ఉంటే వాటిని వెయ్యి బస్సులు తగ్గించారని అన్నారు. మారుమూల గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేయాలని అలాగే బస్సుల సంఖ్య (Number of buses)పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరం విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు ,కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 7.0% మాత్రమే నిధులు కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని దివాల తీయించే విధంగా ఉందన్నారు. గతంలో కేసీఆర్ కిట్ పేరుతో ప్రభుత్వ దావకానాల్లో అమ్మాయిలకు ఇచ్చేవారని కానీ దాన్ని ప్రస్తావన బడ్జెట్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మే, కాస్మెటిక్ చార్జీలు (May, cosmetic charges) పెంచాలని అన్నారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ లోన్ తీసుకున్న మహిళల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించడం జరుగుతుంది అన్నారు.
బతుకమ్మ చీరలు రద్దు చేయడం వల్ల వేల మంది చేనేత కార్మికులు (Handloom workers)ఉపాధి కోల్పోయారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము పునరాలోంచి కార్మికులకు ఉపాధి కల్పించి యధావిధిగా బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలు (Self Help Societies)ఇవ్వాల్సిన వడ్డీ లేని రుణం ఇవ్వాలని అన్నారు. కానీ ఇప్పటివరకు వడ్డీ వసూలు చేస్తూ ఉన్నారాణి, ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. రేషన్ కార్డు లేని మహిళలకు వెంటనే కార్డులు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, జిట్టా సరోజ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి చనపోయిన నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు ఇందిరా, కనుకుంట్ల ఉమారాణి, ఎస్కే సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.