May day: మే డే స్ఫూర్తిని కొనసాగిద్దాం
చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితోకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాల వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు
సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
ప్రజా దీవెన, నల్లగొండ :చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితోకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాల వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం 138వ మేడే దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎగురావేసి మాట్లా డుతూ చికాగో నగరంలో చిందిన రక్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు నాంది పలికిందని అనేక కార్మిక ఉద్య మాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడుతారు.
వ్యవస్థకు పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా చట్టాలు చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తుంద న్నారు.దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ కార్మిక వర్గాన్ని మరింత దోపిడికి గురి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరస్వామి గురిజరామచంద్రన్,బి నర సింహ,తీర్పార్ వెంకటేశ్వర్లు, లెనిన్,ముత్యాలు,మదర్,దోమకొండ వెంకన్న, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
May Day Celebrations in nalgonda