Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MGU University: రంగవల్లులు తెలుగు సంస్కృతికి ప్రతీకలు

MGU University: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : రంగవల్లులు తెలుగు సంస్కృతికి నిదర్శనమని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. ఉపేందర్ అన్నారు. శుక్రవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక శాఖ మరియు మహిళా సాధికారికత విభాగాల ఆధ్వర్యంలో రంగోలి పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల ఫలితాలను ప్రకటించిన ఉపేందర్ మాట్లాడుతూ ముగ్గులు తెలుగువారి సాంస్కృతిక వారసత్వమని అన్నారు. విద్యార్థినులు తెలుగు సంస్కృతిని కాపాడడం అభినందనీయమని అన్నారు. జీవితంలో అనేక రంగులున్నట్లుగానే రంగవల్లిలోణి రంగులు జీవిత తాత్వికతను చాటి చెప్తాయని అన్నారు.

ఈ పోటీల్లో డిగ్రీ కేటగిరీలో ప్రథమ బహుమతి గాయత్రి, సూర్యకళకు,. ద్వితీయ బహుమతి శివాని, బాంధవ్య, తృతీయ బహుమతి రమ్య, సంయుక్తలకు లభించింది. పిజి కేటగిరీలో ప్రథమ బహుమతి బండారి మనీష, ద్వితీయ బహుమతి పావని, కీర్తి, తృతీయ బహుమతి రాణి, కీర్తిలకు లభించాయి. మహిళా అధ్యాపకులకు జరిగిన పోటీల్లో ప్రథమ బహుమతి మహేశ్వరీ, ద్వితీయ బహుమతి సావిత్రిలకు లభించాయి. నాన్ టీచింగ్ ఉద్యోగులకు జరిగిన పోటీల్లో ప్రథమ బహుమతి విద్యావతి, కవిత, ద్వితీయ బహుమతి రేణుక, పద్మలు గెల్చుకున్నారు.

ప్రోత్సాహక బహుమతి అరుణ్ కుమార్, సామ్యూల్, నిఖిల్ గెల్చుకున్నారు. బహుమతి ప్రధానం త్వరలో జరగబోయే గణతంత్ర వేడుకల్లో ఇస్తామని ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా పాలనాధికారి శ్రావణి, జంతుశాస్త్ర అధ్యాపకులు డా. జ్యోత్స్నలు వ్యవహారించారు. కార్యక్రమంలో సంస్కృతిక శాఖ కార్యదర్శి డా. వెల్దండి శ్రీధర్, పీడీ మల్లేశం, సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.