Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MGU university : ప్రతి విద్యార్థి విజయబాటకు ఫలి తాల ఆధారిత విద్య

MGU university : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఐక్యూఏసి ఆధ్వర్యంలో అవుట్ కం బేస్డ్ ఎడ్యుకేషన్ (ఫలితాల ఆధారిత విద్య ) అంశంపై అధ్యాపకులకు శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఉస్మాని యా విశ్వవిద్యాలయం ఎడ్యు కేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఆచా ర్యులు ఆచార్య రామకృష్ణ మరి యు ఆచార్య లలిత ముఖ్య అతి థిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆచార్య రామకృష్ణ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలకై పాఠ్య ప్రణాళిక రచన, అభ్యస నం, మూల్యాంకనం, నాణ్యత ప్రమాణాల పెంపుకై నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చేరిన పిమ్మట కోర్సు పై పూర్తి అవగాహన కల్పించి, ఉపాధి అవకాశాలను తెలియపరచడంతో పాటు సామాజిక స్పృహను సైతం కల్పించడం అధ్యాపకుల బాధ్య తగా సూచించారు.

అభ్యసనం విద్యార్థి కేంద్రంగా వారి పరిపూర్ణత భాగస్వామ్యంతో సాగినప్పుడు ఉత్తమ ఫలితాలను సాధించ వచ్చునన్నారు. విద్యార్థులను ఆవిష్కరణల వైపు మళ్ళించడం ఉత్తమ ప్రమాణంగా అధ్యాప కులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి, ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఐ క్యూఏసి డైరెక్టర్ డా మిరియాల రమేష్, డా వై ప్రశాంతి, డా శ్వేత, తదితర అధ్యాపకులు పాల్గొ న్నారు.