Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy: మరోసారి దాతృత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి

–గిరిజన కుటుంబానికి ఆర్థిక సహాయం
–డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ద్వారా రూ.50 వేలు అందజేత

Minister Komatireddy: ప్రజా దీవెన, నల్లగొండ: నిరుపేద కుటుంబానికి రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) వెంకటరెడ్డి ఆర్థిక సహా యం అందజేసి మరోసారి తన దాతృత్యం చాటుకున్నారు. దామ రచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని సాత్ తండాకు ( Saat Tandaku)చెందిన రూపవత్ శిరీష (15) తొమ్మిదో తరగతి చదువు తూ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి అపస్మారత స్థితిలోకి వెళ్ళింది.దీంతో కుటుంబ సభ్యులు మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిం చగా పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి చికిత్స కోసం నల్గొం డ జిల్లా కేంద్ర ఆస్పత్రికి (Central Hospital)తీసుకువ చ్చారు. చికిత్స పొందుతూ శిరీష ఈరోజు ఉదయం మృతి చెందింది.

విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)గిరిజన విద్యార్థిని మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కు టుంబ సభ్యులకు సానుభూతి తెలి పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ డం బాధాకరమైన విషయమ న్నారు. డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ద్వారా ఆదివారం శిరీష తల్లిదండ్రులకు రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.