Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Miryala Ramesh: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా డా మిర్యాల రమేష్

Miryala Ramesh: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల అధ్యాపకుడు డా మిరి యాల రమేష్ కు (Miryala Ramesh) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ అధ్యా పక అవార్డును ప్రకటించింది. మహా త్మా గాంధీ విశ్వవిద్యాల యంలో పలు శాఖలో విశేషమైన సేవలు అందించిన రమేష్ గుర్తించి ఈ అవార్డును ప్రకటించడం పట్ల అధి కారులు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ (Commerce and Business Management) కళాశాల ప్రిన్సి పాల్ గా, బిజినెస్ మేనేజ్మెంట్ బాగా అధిపతిగా, పరీక్షల నియం త్రణ అధికారిగా, హాస్టల్స్ డైరెక్టర్ గా ప్రస్తుతం ఇంటర్నల్ క్వాలిటీ ఆక్సిడెంట్ సెల్ డైరెక్టర్ (Quality Oxidant Cell Director) గా డా రమేష్ వ్యవహరిస్తున్నారు.

నల్లగొండ పట్టణ స్థానికుడైన రమేష్ (ramesh) ప్రాథమిక విద్యను నల్లగొండ నాగార్జునసాగర్ లో అభ్యసించి అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పీహెచ్డీలు పూర్తి చేసి, రామానంద తీర్థ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకునిగా అనంతరం మహాత్మా గాంధీ విశ్వవిద్యా లయంలో సహా ఆచార్యులుగా ఎంపికయ్యారు. జాతీయ అంత ర్జాతీయ స్థాయిలో అనేకమైన పరిశోధన పత్రాలు సమర్పించి, కార్యాశాలలు, సెమినార్లు నిర్వ హించారు. గాంధీ విశ్వవిద్యా లయంలో (Gandhi University) అధునాతన టెక్నాలజీ ద్వారా పరిశోధన, పారదర్శకమైన పరిపాలన కు విశేషమైన కృషి చేశా రు. కరోనా విపత్కర కాలంలో విద్యా ర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరాన్ని గాడిలో పెడుతూ మిగతా విశ్వ విద్యాలయాలకు ప్రేరణగా నిలి చారు. తమ సహచరునికి అత్యం త విలువైన గుర్తింపు లభించడం పట్ల సహాధ్యాపకులు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, రమణా రెడ్డి, తదితరులు అభినందనలు తెలిపారు.