Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Balu Naik : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

–చెట్లను పెంచు ఆరోగ్యానికి పంచు
–పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య భద్రత
–భారీ ర్యాలీగా తరలి వచ్చిన పలు పాఠశాల విద్యార్థులు
–దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు ఘన స్వాగతం

MLA Balu Naik :ప్రజా దీవెన, దేవరకొండ :నల్లగొండ జిల్లా, దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవ రణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వేచ్చదనం పచ్చ దనం (Freedom is green)కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరై, పట్టణ ప్రజా ప్రతినిధులు మరియు ఉపాధ్యా యులు, విద్యార్థులతో కలిసి దేవ రకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (Nenavat Balu Naik) స్వేచ్చదనం పచ్చదనం కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ స్వయం సహాయక సంఘాల తో సమావేశాలు నిర్వహించి అంద రినీ భాగస్వాములను చేయాలని సూచించారు. వ్యక్తిగత పరి శుభ్రత, సీజనల్‌ వ్యాధులు, ప్టాస్టిక్‌ విని యోగంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్‌లలో పారిశుధ్యం పనులతో చేపట్టడంతో పాటు, ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ మురుకి కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో అయిల్‌బాల్స్‌ వేసి దోమల వృద్ధిని అరికట్టాలన్నారు.

స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమంపై విద్యార్థులకు వ్యాసం, పద్యం, గేయాల రచన పోటీలు (Essay, Poem, Song writing competitions) నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించాలని సూచించారు. వన మహోత్సవంలో భాగంగా పట్టణాల్లో అధిక సంఖ్యలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు అనువైన స్థలాలను గుర్తించాలని ప్రతీ ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలని చెప్పారు. కుక్కల బెడద ఉన్న ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ప్రకృతి వనాల్లో చనిపోయిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలు నాటాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి (Plants should be planted) ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మురుగునీటి గుంతలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఎమ్మెల్యే విద్యార్థులకు, మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా, పట్టణ మాజీ సర్పంచ్ వేంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు హన్మంతు వెంకటేష్, పట్టణ కౌన్సిలర్లు వడ్థ్య దేవేందర్ నాయక్, సైదులు, శ్రీనయ్య, పిఎసిఎస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉమేర్, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుల బృందం, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.