Mudireddy Sudhakar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కార్పొరేట్లకు భజన చేస్తూ కార్మిక హక్కులు (Labor rights) కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy)పిలుపుని చ్చారు. ఆదివారంలో సిపిఎం 8వ పట్టణ మహాసభ దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లైంగిక దాడి కేసులో జైల్లో ఉన్న డేరా బా బా ను హర్యానా ఎన్నికలు జరు గుతున్న సమయంలో ఫెరోల్ పై బయటికి పంపి ప్రచారంలో వాడు కుంటున్నారని విమర్శించారు. ఒక కుటుంబం పై దాడి చేసి గర్భవతిగా ఉన్న మహిళపై లైంగిక దాడి చేసిన దుండగులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం అలాంటి వారికి బిజెపి నేతలు వంత పాడడంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 18 శాతం తగ్గితే భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించడం లేదని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు భారంగా మారుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా కృషి చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వదిలిపెట్టి పరస్పరం విమర్శలు చేసుకోవడంతోనే కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం (BJP Govt) పేదల కడుపులు కొడుతూ పెద్దల పొట్టలు నింపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక వ్యతిరేక చట్టాల అమలు చేస్తుందని ఇది ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ పరిస్థితి భారతదేశంలో ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ దోపిడిని పేద ప్రజలు కొంతవరకు మాత్రమే సహిస్తారని సహనం నశించినప్పుడు ఎంతటి వారినైనా ఎదిరించేందుకు వెనుకాడరని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం (Central Govt). కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని డిమాండ్ (demnad)చేశారు. మహాసభల (mahasabalu)ప్రారంభానికి ముందు *సిపిఐ ఎం జెండాను సీనియర్ నాయకులు కుంభం కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, జిల్లా సీనియర్ నాయకులు ఉట్కూరు నారాయ ణరెడ్డి పాల్గొని మాట్లాడారు. పట్టణ కార్యదర్శి ఎండి సలీం గత మూడు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాల కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టి సభ్యుల చర్చ అనంతరం ఆమోదింప చేయడం జరిగింది.
జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య ,తుమ్మల పద్మ గాదే నరసింహ అధ్యక్ష Dandampalli Sattiah, Tummala Padma Gade Narasimha president) వర్గంగా వ్యవహరించారు. మహాసభల ప్రారంభం ముందు అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి, బుద్ధదేవ్ భట్టాచార్య, అనంతరామ శర్మ ప్రొఫెసర్ సాయిబాబా తదితర అమర వీరులకు సంతాపం వ్యక్తం చేయ డం జరిగింది.అనంతరం 19 మంది తో నూతన కమిటీని, z పట్ట ణ కార్యదర్శిగా దండెంపల్లి సత్త య్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి ఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండంపల్లి సరోజ, గాదె నరసింహ, పాక లింగయ్య, మైల యాదయ్య,, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, మారగోని నగేష్, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి ,ఆకిటి లింగమ్మ, గుండాల నరేష్, గంజి నాగరాజు, సలివోజు సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి ,ఎగ్బాల్ సాజిద్, కందుల అశోక్, శాఖ కార్యదర్శులు కారంపూడి రాము, సీతా వెంకటయ్య, దండెంపల్లి దశరథ, పనస చంద్రయ్య, కుంభం లక్ష్మమ్మ, రుద్రాక్షి రామచంద్రు కోట సైదులు మేడిశెట్టి లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
