భార్య, ప్రియుడు, స్నేహితులకు లైఫ్ టైం జైల్
తీర్పు వెల్లడించిన ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్
Murder: ప్రజాదీవెన, నల్లగొండ: వివాహేతర సబంధానికి అడ్గుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్యకు, సహకరించిన స్నేహితులకు నల్లగొండ అదనపు మూడవ ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గప్రసాద్ మంగళవారం తీర్పును వెల్లించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం 2019 జూలై 1వ తేదీన అర్ధరాత్రి నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గందవారిగూడెం రోడ్డు సమీపంలో సోమ కేశవులు భార్య స్వాతితో కలిసి జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో స్వాతి, దుబ్బ ప్రదీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అక్రమ సంబంధానికి భర్త కేశవులు అడ్డు వస్తున్నాడని ప్రియుడు దుబ్బ ప్రదీప్, అతని స్నేహితులైన కొడిదేటి శివకుమార్, కుంభం ప్రసాద్, చింతపల్లి నగేష్ లతో కలిసి సోమ కేశవులను సుత్తితో చాతిపైన కొట్టి హత్య చేశారు. మృతుని తండ్రి సోమ నాగులు ఇచ్చిన పిర్యాదుతో నిందితులపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో యూ/సెక్షన్ 302, 201, 120(బీ) ఆర్/డబ్లూ34 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఈ కేసు కోర్టులో ఫైనల్ కు రావడంతో సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించగా, జడ్జి కేసు పూర్వాపరాలను పరిశీలించారు.
నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికీ రూ.5వేలు, మొత్తం రూ.75వేలు జారిమానా చెల్లించాలని, లేదంటే మరో 6నెలలు జైలు శిక్ష విధించాలని తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించి కోర్టుకు అందజేసి, నిందితులకి శిక్ష పడేలా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిగిడాల సురేష్, నల్లగొండ వన్ టౌన్ సీఐ, ప్రస్తుత నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి, ప్రస్తుత నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి జవహర్ లాల్, సీడీవో వి శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్, బి.వెంకటేశ్వర్లు, పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ లను ఎస్పీ శరత్ అబినందించి రివార్డ్ అందజేస్తామని చెప్పారు.