*రాబోయే ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేసిన *
*బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి*.
Bjp NagamVarshitReddy ప్రజా దీవెన, నల్గొండ టౌన్:నల్లగొండ పట్టణం 9వవార్డులో వివిధ పార్టీల నుండి యువత, మహిళలు పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరటం జరిగింది అని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి తెలిపారు..ఈ సందర్బంగా నాగం వర్శిత్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలకు చేసిన మంచి పనులను మరియు దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే త్వరగా అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకంతో బిజెపి పార్టీలు చేరడం జరిగింది అని తెలిపారు..
గత శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లతో ప్రజల ఓట్లు వేయుంచుకొని అధికారంలొకి వచ్చి ఇప్పుడు అమలు పరచడంలో వివఫలం అయింది అని తెలిపారు
రైతులను, నిరుద్యోగులను, మహిళలను, దళితులను, బీసీలను అన్ని వర్గాల వారికి దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేసింది అని తెలుపుతూ
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని తెలిపారు. రాబోవు స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రభుత్వానికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలిపారు
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపి నాయకులు పిల్లి రామరాజు,బీజేపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు పొతేపాక సాంబయ్య గారు, లకడాపురం వెంకటేశ్వర్లు, మిర్యాల వెంకటేశం, నాగరాజు, భాస్కర్ , బూత్ అధ్యక్షులు బోడ వంశీ యాదవ్ , బుడిగ భరత్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ లో చేరిన వారు ఈర్ల సైదులు, మునుపటి కిరణ్, నాంపల్లి రమేష్, ఉంగరం సాయి, మునుపటి నగేష్, నాంపల్లి ముత్తయ్య,అర్జున్, రజినీకాంత్,కృష్ణ, రాములు, రేణుక,పద్మా,చంద్రారెడ్డి, రాణి కళ్యాణి, ఈశ్వరి,అమృతమ్మ, , విజయ్ కుమార్, రాజు, వేణు విగ్నేష్, శ్రీకాంత్,మధు తదితరులు పాల్గొన్నారు