Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagam Varshit Reddy: షరతులు లేని రుణమాఫీ కావాలి

— బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి

Nagam Varshit Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ మండలంలోని మేళ దుప్పలపల్లి, అనంతారం, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు రుణ మాఫీకి అర్హులైనప్పటికి మా రుణాలను మాఫీ (Waiver of loans)చేయడం లో ఇండి యన్ బ్యాంక్ అధికారులు నిర్ల క్ష్యంతో రుణమాఫీ కాలేదని శని వారం నల్లగొండలోని ఇండియన్ బ్యాంకు వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy), బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ (Pilli Ramaraju Yadav),పోతేపాక సాంబయ్య, బిజెపి నల్లగొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బ్యాం కులకు సీలింగ్ పెట్టడం వల్లనే బ్యాంకు అధికారులు రైతుల వివరాలను సకాలంలో పంపలేదని దీనికి ప్రభుత్వంమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇండియన్ బ్యాంకు వారు 1200 మంది రైతులకు గాను 400మంది రైతుల వివరాలను ప్రభుత్వం కు పంపడం అంటే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, రు ణమాఫీ అమలు (Implementation of debt waiver)అయ్యే వరకు రైతులకు అండగా బీజేపీ ఉంటుంది అని అన్నారు. ఈ ధర్నా కార్యక్ర మంలో రైతులు ముత్యాల శంకర్ రెడ్డి, మేకల వెంకటేశం, నల్ల నర్సిం హా, బుచ్చాల నాగరాజు గౌడ్, బొమ్మిడి శ్రీకాంత్,సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నల్లబోతు వెంకన్న, కొడదల వెంకన్న, సుధాకర్ రెడ్డి,వెంక న్న, మనిమద్దె నగేష్ కనుకుల రాజేందర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, బోగరి ప్రకాష్, నడ్డి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.