–నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద
–26గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల విడుదల
–ప్రస్తుతం 3.74 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
–కడలి దిశగా గోదావరి, కృష్ణమ్మ పరుగులు
–సముద్రంలో కలిసిన 1,756 టీఎంసీలు
Nagarjunasagar:ప్రజా దీవెన, నల్లగొండ: నాగార్జునసాగర్ (Nagarjunasagar)కు పోటెత్తిన వరద పోటెత్తుతోంది. నాగార్జునసాగర్ తో పాటు అన్ని ప్రాజెక్టులకు వరద కొన సాగుతోంది. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చి నట్లే దిగువకు వదిలేస్తున్నారు. శుక్ర వారం భారీ ఎత్తున వరద పోటెత్త డoతో ప్రాజెక్టులోకి (project) 3,74,304 క్యూ సెక్కుల వరద వచ్చి చేరుతుండగా మొత్తం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, కుడి, ఎడమ కాల్వలు, అన్ని మార్గాల ద్వారా జలాశయం నుంచి మొత్తం 4,02,098 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది.
ఎగువన ఉన్న శ్రీశైలానికి (to Srisailam) 3,54,761 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇటు ఎగువ గోదావరిలో మహారా ష్ట్రలోని జైక్వాడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి దాకా ప్రాజెక్టులకు (Projects up to Ellampally)నా లుగు అంకెల వరదే కొనసాగు తోంది. 102.732 టీఎంసీల సామ ర్థ్యమున్న జైక్వాడిలో ప్రస్తుతం 45.45 టీఎంసీలే ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టుకు 8,044 క్యూసెక్కుల వరద వస్తోంది. మంజీరా నదిపై ఉన్న సింగూరుకు 1,445 క్యూ సెక్కులు, నిజాంసాగర్కు 400 క్యూసెక్కులు, ప్రధాన గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సా రెస్పీ)కు 6,150 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 6,150 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,816 క్యూసె క్కుల ఇన్ ఫ్లో ఉంది.