— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజా దీవెన, చందంపేట:
Collector Ila Tripathi: విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, చందంపేట మండలం చిత్రీయాల్ గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు .విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ఎంఈఓ చందర్ తో మాట్లాడుతూ యూనిఫామ్, బుక్కులు పంపిణీ చేశారా? లేదా అని అడిగారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చాక్లెట్లు పంపిణీ చేసి బాగా చదువుకోవాలని సూచించారు.
అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ,ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. చందం పేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్, వైద్య సిబ్బందితో మాట్లాడుతూ.. మండలంలో మాతా, శిశు మరణాల వివరాలను ,మహిళల్లో రక్తహీనత, వైద్య చికిత్సలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, మండల ప్రత్యేకాధి కారి, జిల్లా మైన్స్ సహాయ సంచాలకులు జాకబ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి డిటిడిఓ చత్రు నాయక్, ఎంఈఓ చందర్, తహసిల్దార్ శ్రీధర్ బాబు, ఎంపీడీవో లక్ష్మి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.