Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Press Club: నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : హైదరాబాద్ లో టీవీ9 ప్రతినిధిపై సినీ నటుడు మంచు మోహన్ బాబు జరిపిన దాడికి నిర సనగా నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో జర్న లిస్టులు నిరసన ర్యాలీ తో పా టు ధర్నా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున జర్నలిస్టుల కలిసి నిర్వహించిన ధర్నాలో మోహన్ బాబు దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్బంగా నల్ల గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శు లు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ లు మాట్లాడుతూ స మాజంలో సినీ నటునిగా పేరు ప్ర ఖ్యాతలు కలిగిన మోహన్ బాబు తన కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలతో సహనం కోల్పో యి మీడియా పై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించా రు. అనుచిత ప్రవర్తనతో ఆదమర్చి మీడియా పైనే దాడి చేసిన మోహ న్ బాబు పై ప్రభుత్వం వెంటనే చ ర్యలు తీసుకోవాలని, వెంటనే బా బును అరెస్టు చేసి కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు.

నల్లగొం డ జిల్లా టియుడబ్ల్యూజే అధ్యక్షు డు గుండగోని జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ సినీ నటుడు మోహ న్ బాబు దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. సమాజంలో సము చితమైన స్థానం కలిగి ఉన్న వ్యక్తి చేయాల్సిన పని కాదని హితవు పలికారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ వెంటనే మోహన్ బాబు పై చర్యలకు ఉపక్రమించాలని లేదంటే జర్నలిస్టుల ఉద్యమాలు తీవ్రతా లు అవుతాయని హెచ్చరించారు. మోహన్ బాబు చేసిన దానికి పశ్చాతాపపడుతూ తక్షణమే నేరుగా సదరు మీడియా ప్రతినిధికి క్షమాపణ చెప్పాలని, లేదంటే నల్ల గొండ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు ఉద్యమాలు మరింత ఉధృతంగా కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే చర్యలు భవి ష్యత్తులో మరే ఇతర ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు దూకుడు తనంతో ఇటువంటి చర్యలకు పా ల్పడకుండా అడ్డుకున్న వారు అ వుతారని సూచించారు. మోహన్ బాబు పై తక్షణల చర్యలు తీసు కోకుంటే జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ఉధృతమైన కార్యక్రమాలు చేప ట్టడం ద్వారా మోహన్ బాబును దుశ్చర్యలను ఎండగడుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చిన్న పత్రికల జర్నలిస్టుల తో పాటు సీనియర్ జర్నలిస్టులు రేవన్ రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, ఫయు ముద్దీన్, చల్లా సాంబశివారెడ్డి, వెంకటరెడ్డి సాల్వద్ జానీ , వెంకటరెడ్డి,రవి, శేఖర్, జానీ, మధు, వినోద్ బిక్షపతి, గిరి ప్రసాద్, కత్తుల యాదగిరి, ఉబ్బని సైదులు,కే, చంద్రశేఖర్, జిన్నా శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్,రామకృష్ణ,ప్రవీణ్, నవీన్, కుశలాచారి, ముచ్చర్ల శ్రీను, ముచ్చర్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.