ప్రజా దీవెన, హైదరాబాద్:
NEET 2025 Farhan: నల్లగొండ జిల్లా కేంద్రంలోని రహమాన్ బాగ్ కి చెందిన మహమ్మద్ ఫరీద్ ఫరాజెబా దంపతుల కుమారుడు ఎండి. ఫర్హాన్ శనివారం వెలువడిన నీట్ 2025 ఫలితాలలో 99.67 శాతం మార్కులతో జాతీయ స్థాయిలో 2833 వ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా సుమారు 21 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షలో ఫర్హాన్ మంచి ర్యాంక్ సాధించడం పట్ల పలువురు పట్టణ ప్రము ఖులు ఫర్హాన్ ని అభినందించారు.
తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం, తన అకుంఠిత దీక్షతో నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించానని ఫర్హాన్ తెలిపారు.