–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నకిరేకల్: పచ్చ దనం,వాతావరణ (Greenery, atmosphere)సమతు ల్యానికై మొక్కలనునాటాలని, రోగాలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. “స్వచ్ఛదనం -పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన”స్వచదనం-పచ్చదనం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.పరిసరాలు పరిశు భ్రంగా ఉంటే రోగాలు రావని, పచ్చ దనం లేకుంటే వర్షాలు రావని, వాతావరణ సమతుల్యత ఉండ దని కలెక్టర్ అన్నారు. అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాల్సిన బాధ్యత మనందరిపై ఉం దని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టి న “స్వచ్ఛదనం,- పచ్చదనం” (“Cleanliness,- greenness) 5 రోజుల కార్యక్రమాలలో పరిసరా లలో ఉండే పిచ్చి మొక్కలను తొల గించడం, పరిసరాలన్నింటిని శుభ్రం గా ఉంచుకోవాలని పిలుపుని చ్చారు . పచ్చదనాన్ని పెంపొందించుకొనేందుకు వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు, వాతావరణ సమస్యల కోసం మొక్కలను నాటి సంరక్షించాలని ,ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని అన్నారు.
వీధి కుక్కల బెడదను తగ్గించేందుకుగాను జిల్లాలో త్వరలోనే స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఒక మోడల్ పాఠశాల గా తీర్చిదిద్దేందుకు పూర్వ విద్యార్థులు, దాతలు, గ్రామస్తులందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై రాష్ట్రప్రభుత్వం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని ,ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని, గ్రామస్థాయిలో ప్రజలు పూనుకున్నప్పుడే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని అన్నారు. త్వరలోనే నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ఎన్నారై తో సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి సహకారం కోరాలని ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.సమావేశానికి అధ్య క్షత వహించిన నకిరేకల్ శాసనస భ్యులు వేముల వీరేశం మాట్లాడు తూ గ్రామాలు, పట్టణాలలో పరిశు భ్రతతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 రోజుల పాటు అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అన్నారు.
అనారోగ్యం పాలు కావడానికి మనకు మనమే కారణం అవుతున్నామని, అది లేకుండా ఉండాలంటే ఇంటితోపాటు, పరిసరాలను శుభ్రంగా ఉంచు కోవాలని, ఇలాంటి బాధ్యతతో కూడిన చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు ఈ కార్యక్ర మాన్ని చేపట్టామని తెలి పారు. కరోనా సమయంలో అపరి శుభ్రత కారణంగా ప్రజలు విలవి లలాడారని ఆయన గుర్తు చేశా రు .మొక్కలు నాటకపోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోక పోవడం, శారీరక శ్రమ వంటివి తగ్గిపోవడం వల్ల అనవసరమైన రోగాల జబ్బున పడుతున్నారని ఆయన తెలిపారు.
ప్రతి ఇంట్లో కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచాలని పిలుపుని చ్చారు నకిరేకల్ (Nakirekal)పట్టణాన్ని మంచి పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ,పచ్చదనం లేనందు వల్లనే వర్షాలు రావడం లేదని అందువల్ల ఖాళీ ఉన్న ప్రతి చోట మొక్కలు నాటాలని చెప్పారు.నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రైవేట్ పాఠ శాలలకు దీటుగా తీర్చిదిద్దేం దుకు దత్తత తీసుకున్నట్టుగానే నకిరేకల్ మున్సిపాలిటీని సైతం మంచిగా తీర్చిదిద్దేందుకు గాను సహకారం అందించాలని ఆయన జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. పిఎసిఎస్ చైర్మన్ నాగిల్ల వెంకటేశ్వరరావు, మున్సిప ల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ (Chairman Nagilla Venkateswara Rao, Municipal Chairman Rachakonda Srinivas)మా ట్లాడారు.అంతకుముందు ప్రధాన రహదారి నుండి జెడ్ పి హెచ్ ఎస్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారం భించా రు. ఈ సందర్భంగా ముఖ్య అతి థులు జిల్లా పరిషత్ హైస్కూల్లో మొక్కల ను నాటారు అంతేకాక కార్య క్రమా నికి హాజరైన వారికి ఉచితంగా మొక్క లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి మున్సి పల్ కమిషనర్ బాలయ్య అధ్యక్షత వహించగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉమాదేవి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి పర్సనల్ శాఖ ఏడి కృష్ణ తహసిల్దార్ జహీరుద్దీన్, ఎంపీడీవో చంద్రశేఖర్,ఎం ఈ ఓ నాగయ్య ,కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.