–మండలాలకే జిల్లా కలెక్టర్ తో సహా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు
–మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజర వుతారు
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో (NALGONDA) ఈ నెల 23వ తేదీ ఈ సోమవారం నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమా న్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) తెలిపారు. శనివారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ ఈ సోమవారం నుండి మండల స్థాయిలోనే జిల్లా స్థాయిలో నిర్వహించినట్లుగానే ప్రజావాణి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తు న నిర్వహిస్తున్నందున జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని (Public radio program) రద్దు చేయ డం జరిగిందని చెప్పారు. ఈ విష యాన్ని దృష్టిలో ఉంచుకుని అర్జిదా రులు, ఫిర్యా దుదారులు జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సమర్పించేం దుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సోమవారం నుండి నల్గొండ జిల్లా లోని 33 మండలాలతో పాటు, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలలో సైతం ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన ఆయా మండలంలోని ప్రజలు వారికి సం బంధించిన ఫిర్యాదులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో (Public radio program) సమర్పించాలని కోరారు. మండల స్థాయిలో సైతం జిల్లా లో మాదిరిగానే ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్య క్రమం (Public radio program)ప్రారంభం అవుతుం దని, మధ్యాహ్నం 2 గంటలకు ముగు స్తుందని, మండల స్థాయి లో అన్ని రకాల సమస్య లను ప్రజావాణిలో సమర్పించ వచ్చని తెలిపారు. ము ఖ్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలతో పాటు, భూములు ఇతర సమస్యలను సైతం ఈ ప్రజావాణి కార్యక్రమాల్లో సమర్పిం చవచ్చని పేర్కొన్నారు.మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం (Public radio program) ఎంపీడీవో (MPDO) అధ్యక్షతన జరుగుతుం దని, మండల ప్రత్యేక అధికారి తహసిల్దార్, మండల విద్యాధికారి, వ్యవసాయ అధికారి, ఏపిఎం తోపాటు,ఇతర అధికారులు మండల ప్రజావాణి కార్యక్రమంలో ఉంటారని ,జిల్లాలో మాదిరిగానే ఫిర్యాదుదారులకు రసీదు ఇవ్వడం జరుగుతుందని, అంతేకాక ప్రతి ఫిర్యాదుకు ఒక ఒక ఐడి నెంబర్ ను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయిలో పరిష్కారం కానీ ఫిర్యాదులు 15 రోజుల తర్వాత జిల్లా స్థాయి ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో తిరిగి ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియ జేస్తామని ఆయన స్పష్టం చేశారు.