Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలో విలీన ప్రాంతమైన 11వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యలను (Assign problems) పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య కోరారు మంగళవారం కతాల్ గూడ ప్రాథమిక పాఠశాల లో నోట్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి (Narayana Reddy)కి సిపిఎం 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో వార్డు సమస్యల ను పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 2013లో నల్గొండ పట్టణంలో విలీనం అయిన తర్వాత పట్టణవాసులుగా గుర్తింపు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగ లేదని అన్నారు.
అర్బన్ కాలనీ లో ఉన్న గ్రౌండ్ కు అర్బన్ క్రీడా ప్రాంగ ణం (Ground to Urban Sports Complex)అని బోర్డు తగిలించారు తప్ప ఎలాంటి పరికరాలు ఇవ్వలేదని, ఆ గ్రౌండ్ కు ప్రహరీ గోడ, వాకింగ్ ట్రా క్, ఓపెన్ జిమ్, క్రీడా సామాగ్రి ఏ ర్పాటు చేయాలని, కతాల గూడెం స్మశాన వాటికకు ప్రహరీ గోడ ని ర్మించి మౌలిక సదుపాయాలు క ల్పించా లని, దేవరకొండ రోడ్డు నుండి వయా మామిళ్లగూడెం మీదుగా రాజీవ్ గృహకల్ప వరకు డబుల్ సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణం చేయాలని, గ్రామ కంఠం భూములు (Gram Kantham lands)ప్రభుత్వ ద్వారా లబ్ధి పొంది లబ్ధిదా రులు అమ్మితే కొన్న వారి సాదా బైనా మీలా ఆధారంగా ఓల్డ్ అఫ్ ద ప్రాపర్టీ విధానాన్ని రద్దుచేసి ఇంటి పన్ను డిమాండ్ నోటీసు ఇంటి యజమాని పేరుతో ఇవ్వాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెం టర్ కు డాక్టర్ అందుకు అవస రమైన సిబ్బంది నియమించాలని, సమబావనా సంఘాలకు మహిళా సమాఖ్య భవనం (Women’s Federation Building) నిర్మించాలని, వార్డులోని వివిధ కాలనీలలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టా లని, ఖాతాలో కూడా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 130 మంది విద్యార్థులు ఉన్నందు న ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోవడం లేదని విద్యా ర్థుల సంఖ్య కనుగుణంగా మరో రెండు తరగతి గదుల నిర్మా ణం అవసరం ఉన్నందున మంజూ రు చేయించగలరని ఆ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య , వార్డు సభ్యులు ఊబిది యాదయ్య , వానరాశి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు