Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ఇసుక శాండ్ టాక్స్ లోనే బుక్ చేసుకోవాలి

–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ఇసుక అవసరమైన వారు శాండ్ టాక్ట్స్ లో మాత్రమే బుక్ చేసుకొని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి (Narayana Reddy) తెలిపారు. బుధవారం అయన నల్గొండ నుండి గుర్రంపోడు వెళ్తున్న సందర్భంలో మావిళ్ళగూ డెం ,పర్వతగిరి గ్రామాల మధ్య ఇసుక ట్రాక్టర్లు వెళ్తుండగా గమనించి వాటిని ఆపి ఇసుక అనుమతులు,లైసెన్సు తదితర వివరాలను తనిఖీ (CHECKING)చేశారు.

రశీదులు ,ఆన్లైన్ బుకింగ్ (Receipts, Online Booking) అన్నింటి ని తనిఖీ చేసి శాండ్ టాక్స్ ద్వారానే ఇసుక బుక్ చేసుకుని తీసుకు వెళుతున్నారని గమనిం చిన జిల్లా కలెక్టర్ అనంతరం మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ,ఇసుక అవసరం ఉన్నవారు తప్పనిసరిగా శాండ్ టాక్ట్స్ లో బుక్ (BOOK) చేసుకుని మాత్రమే తీసుకెళ్లాలని సూచించా రు.