–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: వనమ హోత్సవం (vana mahotsavam) కింద ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం మొక్క లు నాటడాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అధి కారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్య దర్శి ఏ. శాంతి కుమారి వివిధ అం శాలపై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ (video conference)నిర్వ హించారు.అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షిస్తూ వన మహోత్సవం కింద నాటా ల్సిన మొక్కలపై ఇదివరకే ఆయా శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, మొక్కలు నాట డంతో పాటు వాటిని సంరక్షించాలని, నాటిన ప్రతి మొక్క జియో ట్యాగిం గ్ చేయాలని ఆదేశించారు.
ఈ విష యంలో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలి అన్నారు. బదిలీలపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం బదిలీలు పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఆశ, అంగ న్వాడి తదితర తనిఖీలు (checking)నిర్వహిం చి నివేదికల సమర్పించాలని ఆదే శించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమారి (shant Kumari) జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రభు త్వ లక్ష్యాలను పూర్తి చేయా లని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యా లను సాధించాలని, గ్రామాలకు అ వసరమైన మొక్కలను, అందులో పెద్ద మొక్కలను నాటాలని, ప్రతి మొక్కను జియో టాగ్ చేయాలని సూచించారు.
ఆడ బిడ్డలను ఆర్థి కంగా శక్తిమంతులను చేసి వారిని కోటీశ్వరులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు. స్వ యం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘా లలో సభ్యు లుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావ లంబనకు సహక రించడం, మహిళల సామాజిక భద్ర త కోణంలో సంఘాలను బలో పే తం చేయడం మహిళాశక్తి పథకం (mahila Shakti padakam) ప్రధాన ఉద్దేశాలని, సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి సంఘాలను ప్రోత్సహించడం, మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ ఉత్పత్తులను ఎంచుకుని, ఆ ఉత్పత్తులకు అవస రమైన నైపు ణ్యాన్ని అందించడం, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహ కారం కోసం బ్యాంక్ లింకేజీల సదు పాయం కల్పించడం, ఉత్పత్తి అయి న సరుకులు మార్కెటింగ్ కు అవ సరమైన ప్రణాళికలు, సహకారం అంది వ్వడం మహిళాశక్తి పథకంలో భాగ మని, 16 రకాల జీవనోపా దులు ఇందులో భాగమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవే ర్చాలని, జిల్లా, మండల మహిళా సమాఖ్య లతో సమావే శాలు ఏర్పా టు చేసు కొని యాక్షన్ ప్లాన్ తో వర్క్ షాప్ లు ఏర్పాట్లు చేసు కోవా లని సూచించారు. తెలిపారు.
సీజనల్ వ్యాధుల (seasonal diseases)పై ఆమె సమీక్షిస్తూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమతంగా ఉండాలని, సం క్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశు ధ్యం ముఖ్య మని, కిచెన్, టాయిలె ట్స్ పరి శుభ్రంగా ఉండాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసు కోవాలని, డెంగీ, మలేరియా, అతి సారా వ్యాధుల పట్ల అవగాహన కార్య క్రమాలు చేపట్టాలని, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల వైద్యు లు, ఆశా, ఎ.ఎన్. ఎం. సిబ్బంది క్షేత్ర స్థాయి లో క్రియా శీలకంగా ఉండా లని, ఆరోగ్య కేంద్రా లలో (health centre) మందులు అందుబా టులో ఉండాలని సూచిం చారు. వ్యవసాయ రంగంకు సం బంధించి ఎరువులకు ఎలాంటి కృత్రిమ కొరత లేకుండా చూడాలని, రైతు భరోసా అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని, రైతు నేస్తం ప్రోగ్రాముల ద్వారా రైతులకు కావల సిన సల హాలు, నూతన సాగు విధానాలపై ప్రోత్సాహక కార్య క్రమాలు చేపట్టా లని సూచిం చా రు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులలో పూర్తి కాని పనులను వెంటనే చేయాలని తెలిపారు. టీచర్ల బదిలీలు విజయ వంతంగా జరిపిన విధంగానే ఉద్యో గుల బదిలీలు నిబంధనలను పాటి స్తూ ఈనెల 20 లోగా ముగించాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, పూర్ణచంద్ర, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీ ణ అభివృద్ధి అధి కారి నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, డిపిఓ మురళి, డిఎంహెచ్ఓ. డా. కళ్యాణ చక్రవర్తి, ఐసిడిఎస్ పీడీ సక్కుబాయి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరు లు పాల్గొన్నారు.