Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ధరణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

–చందం పేట తహసిల్దార్ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజావా ణి ,ధరణి (Prajavani, Dharani) ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) ఆదేశించారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా వారి సమస్యలకు పరిష్కరం దొరుకుతుందని అన్నారు. శుక్రవారం అయన చందంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని అలాగే ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ (check) చేశారు.ఈ సందర్భంగా గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారని అడగ గా తహసిల్దార్ కార్యాలయం లో 266 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తహసిల్దార్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రజావాణి ఫిర్యాదులను సాధ్యమై నంత త్వరగా పరిష్కరించాలని ఆదేశిం చారు.

ముఖ్యంగా తహసిల్దార్ స్థాయిలో (Tehsildar level) ఉండే ఫిర్యాదులను అప్పుడే పరిష్క రించాలని, ఆర్డీవో స్థాయిలో పరిష్కరించేవి ఆర్డీవో (rdo) పరిష్క రించాలని, ఒకవేళ జిల్లా స్థాయికి పంపించాల్సి ఉంటే జాప్యం లేకుండా పంపించాల్సిం దిగా ఆదేశించారు. మనసు పెట్టి పని చేస్తే నిజమైన ఫిర్యాదుదారు లకు వెంటనే పరిష్కారం దొరుకు తుందని అన్నా రు. ఈ సందర్భంగా ఆయన సిబ్బం దితో మాట్లాడుతూ అందరూ బాగా పనిచేయాలని అన్నారు. అనంత రం జిల్లా కలెక్టర్ ఎంపీడీవో కార్యా లయంలో (MPDO Office) ప్రజావాణి పిటిషన్లు, ఆయా కేటగిరి వారిగా వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకు న్నారు.పరిష్కారం చేయగలిగినవి తక్షణమే చేయా లని, పెండింగ్లో లేకుండా చూడా లని, ఒకవేళ పరిష్కారం కానీ ఫిర్యాదులను ఫిర్యాదుదారు కు స్పష్టంగా తెలియ జేయాల్సిం దిగా ఆయన ఎంపీడీవో లక్ష్మీని ఆదేశించారు. దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మి, ఎంపీపీ పార్వతి ఉన్నారు.