Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: త్వరితగతిన సొరంగం ఔట్ లెట్ పనులు

–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ఎస్ ఎల్ బి సి ఏ ఎమ్ ఆర్ పి ఒకటవ టన్నెల్ ఔట్లెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలె క్టర్ సి.నారాయణ రెడ్డి (Narayana Reddy)ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం అయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో కలి సి ఎస్ఎల్బీసీ ఏఎమ్ఆర్పి ఒకటవ టన్నెల్ ఔట్ లెట్ ను సందర్శించా రు. ముందుగా జిల్లా కలెక్టర్ టన్నెల్ ప్రాజెక్టు కార్యాలయంలో (Tunnel Project Office) ప్రాజెక్టు ఇంజ నీర్లు,ప్రాజక్ట్ నిర్మాణం చేపట్టి న జయప్రకాష్ అసోసియేట్స్ లిమి టెడ్ కంపెనీ ప్రతినిధులతో టన్నేల్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహిం చారు. ఏజెన్సీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ కు ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పి టన్నెల్ వన్ ఔట్లైట్ (Tunnel One Outlight)పథకంపై వివరిస్తూ ప్రపంచం లోనే ఇది అతిపెద్ద ఐదవ పొడవైన టన్నెల్ అని, 10 మీటర్ల డయాతో చేపట్టిన ఈ టన్నెల్ మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు ఉందని తెలిపారు.

ఈ టన్నెల్ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లే సామర్థ్యంతో డిజైన్ చేయడం జరిగిందని, గరిష్టంగా 5570క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఈ టన్నెల్ కు ఉంటుందని, శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) ఎడమకాలువ ద్వారా 1925 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టన్నెల్ నిర్మాణం (Tunnel construction) చేపట్టగా,సవరించిన అంచనాల ప్రకారం ప్రాజక్ట్ 4658. 59 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపా రు. టన్నెల్ నిర్మాణ పనులు ఆల స్యం కావడానికి కారణాలను ఆయన జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ రాష్ట్ర విభజన, కరోనా తదితర కారణాల వల్ల టన్నెల్ నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని వెల్లడించా రు. ఈ సందర్భంగా ఆయన టన్నెల్ సామర్థ్యం, టన్నెల్ డయా తదితర సాంకేతిక అంశాల ను జిల్లా కలెక్టర్ ,ఎస్ పి కి వివరిం చారు.

అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్న మన్నెవారి పల్లి ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel) ఒకటవ ఔట్ లెట్ ను సందర్శించారు. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, అందువలన త్వరితగతన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిం దిగా జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ (Project Engineering)అధికారులతో పాటు, జయప్ర కాష్ అసోసియేట్స్ ప్రతినిధులతో కోరారు.ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు డిండి బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ ( నక్కల గండి ప్రాజె క్టు)ను సందర్శించారు. దేవర కొండ ఆర్డిఓ శ్రీరాములు, టన్నెల్ ఏజిక్యూటివ్ ఇంజనీర్ జి జె వి సత్యనారాయణ, డి ఈ చక్రపాణి, లలిత, అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్లు మహేందర్, రవిరాజ్ తో పాటు ,జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ప్రాజెక్టు ఏజెన్సీ ఏజీఎంలు దీపక్ జైన్, వీరేందర్ సింగ్, చందంపేట తహసిల్దార్ శ్రీనివాస్, చందంపేట ఎంపీపీ పార్వతి తదితరులు ఉన్నారు.