–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్పి రోడ్ లో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (In RP Road, District Medical Health Officer) కార్యాలయానికి ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల హాస్టల్ ను జిల్లా కలెక్టర్ నారాయ ణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ (Random check) చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హాస్టల్ వంటగదిని, భోజనాన్ని, టాయి లెట్లు, డైనింగ్ హాల్, విద్యార్థినుల బ్యారక్ లు, బాత్రూంలు అన్నింటిని పరిశీలించారు. ఆయన బ్యారక్ లలో విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారని ఏం చదువుతున్నారని ఇంటర్మీడియట్ మొదటి సంవత్స రంలో ఎన్ని మార్కులు వచ్చాయని అదేవిధంగా పిజి చదివే విద్యార్థు లు అయితే డిగ్రీలో ఏం చదివారని వంటి వివరాలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం హాస్టల్ (hostel) ఆవరణలోనే విద్యార్థినిలతో పాటు కింద కూర్చుని వారితో మాట్లా డారు.
హాస్టల్లో చదివే విద్యార్థినులు బాగా చదువుకో వాలని ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, గ్రామీణ ప్రాంతం నుండి, పేదరికం నుండి వచ్చిన వారే ఎక్కువ ఉంటారని, విద్యార్థులు సైతం అదే రీతిన కష్ట కష్టపడి చదివి సమాజంలో ఉన్నత స్థానం పొందాలని అన్నారు. రెండు సంవత్సరాలు కష్టపడి చదివితే జీవితంలో స్థిరపడవచ్చు అని చెప్తూ ఈ సందర్భంగా స్వామి వివేకానంద సూక్తిని విద్యార్థులకు బోధిస్తూ “లక్ష్యానికి అడ్డం వచ్చేది, లక్ష్యాన్ని దూరం జరిపేది ఏదైనా విషం తో సమానమని “అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తాను సైతం ప్రభుత్వ పాఠశాల, కళాశా లలో చదివానని, ఎన్నో కష్టాలను అధిగమించి టీచర్ గా పని చేస్తూ, జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగానని విద్యార్థులకు తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జిఎం, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి డి.డి కోటేశ్వరరావు, హాస్టల్ వార్డెన్లు రమ్య సుధా, సోమేశ్వరి తదితరులు ఉన్నారు.