Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: వనమహోత్సవం విజయవంతం చేయాలి

–నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 66 లక్షల 6వేల మొక్కలునాటనున్నాo
–నాటిన ప్రతి మొక్క బతికేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
–అన్ని రహదారులకు ఇరువైపులా, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వద లకుండా మొక్కలు నాటాలి
–క్రమ పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: వనమహోత్సవం కార్యక్రమం (Vanamahotsavam programme)కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66 లక్షల ఆరువేల మొక్కలు (plants)నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలి పారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా,మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకా లని, మొక్కలు నాటేందుకు (To plant plants) సరైన స్థలాలను ఎంపిక చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలు, రహదారులకు. ఇరువైపులా తప్పనిసరిగా మొక్కలు నాటాలని, ఏ కార్యాలయం, రహదారి మొక్కలు నాటకుండా వదలకూడదని, గుంతల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలని, అలా గే మొక్కల ఎంపిక, భూమి సిద్ధం, మొక్క ఎంపికతో పాటు,ఎరువు వేయడం, మొక్కలు నాటిన తర్వా త వాటికి నీటిని పోయడం, సంరక్షిం చడం, వాచర్ ఏర్పాటు, మొక్కల సంరక్షణ వంటి వాటిపట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. మొక్కలు నాటే కార్యక్రమం పై, అలాగే మొక్కల సంరక్షణ విష యమై ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మేట్ వరకు శిక్షణ ఇవ్వాల్సిందిగా డిఆర్డిఓ (drdo) ను ఆదేశించారు.

రహదారులకు (roads) ఇరువైపులా స్థలం ఉంటే బహుళ వరుసల మొక్కలు నాటా లని, జిల్లా స్థాయి కార్యక్రమం తో పాటు, నియోజకవర్గాలలో మొక్క లు నాటేందుకు సంసిద్ధంగా ఉండా లని, సంబంధిత శాసనసభ్యులను మొక్కలు నాటే కార్యక్రమానికి ఆహ్వానించాలని ,జిల్లా అధికారులు (District officials)వారికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడాన్ని పూర్తి చేయా లని ఆయన తెలిపారు. అటవీ భూముల కు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ఎక్కడ అటవీ భూములు అన్యాక్రాంతం కావడానికి అవకాశం ఇవ్వకూడదని, ఎక్కడైనా అన్యా క్రాంతం అవుతున్నట్లు దృష్టికి వస్తే తక్షణమే పోలీసు, రెవెన్యూ దృష్టికి తీసుకురావాలని, కొత్తగా అన్యాక్రాం తం పై కఠినంగా వ్యవహరించాలని, ఎఫ్ఆర్వోలు (mros)వారి పరిధిలో అటవీ భూముల సరిహద్దులను ఏర్పాటు చేయాలని ,ఆటవి భూముల పరిరక్షణలో అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇసుక సరఫరా పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ నిబంధనల ప్రకారమే ఇసుక సరఫరా చేయాలని ,జిల్లాలో ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని, అవసరమైన చోట “మన ఇసుక వాహనం” ద్వారా మాత్రమే ఇసుక సరఫరా చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, ప్రభుత్వ పనులకు ఇసుక సక్రమంగా వెళ్లాలని, ఎక్కడైనా ఇసుక రవాణాలో అక్రమాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ప్రభు త్వ పనులకు ఇసుకను తీసుకునే అధికారులు, ఎగ్జిక్యూ టివ్ ఏజెన్సీ లు సరిగా అమలు చేయాలని, జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో కఠిన చర్యలు చేపట్టి నిఘాను పెంచాల ని,ఇసుక రీచులు ఉన్న గ్రామాలలో అవసరమైతే ప్రభుత్వపనులకు ఇసుకను ఇస్తామని, ఇసుక సరఫరా విషయంలో మండల టీములు పూర్తి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

సీజనల్ వ్యాధులపై (District officials)కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి బృందాలు సీజనల్ వ్యాధుల (District officials) పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్ ను పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, గురువారం ఉదయం 9 నుండి 11 వరకు గ్రామ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి , అనంతరం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు తాగునీటి ట్యాంకులు, లీకేజీలు, మరమ్మతులు అన్నిటినీ పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తక్షణమే వాటిని అరికట్టడమే కాకుండా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, పారిశుద్యం విషయంలో గ్రామమంతా తిరగాలని, ఎక్కడైనా రోడ్ల పై నీరు నిలువ ఉండడం,డ్రైనేజీ మూసుకుపోవడం, పిచ్చి మొక్కలు పెరగడం వంటివి జరిగినట్లయితే వాటిని తొలగించాలని, దోమలు కుట్టకుండా ఫాగింగ్ చేయించాలని అన్నారు.ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (health center) పరిధిలో రెండు చోట్ల అంటువ్యాధులపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు, అందరూఅధికారులు హాజరు కావాలని అన్నారు. ఫ్రైడే ఫ్రైడే తప్పనిసరిగా అన్ని గ్రామాలలో జరిగేలా చూడాలని, వైద్య ఆరోగ్య శాఖ తో పాటు, గ్రామస్థాయిలోని అన్ని శాఖల సిబ్బంది, అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు ఉన్నది లేనిది పరిశీలించాలని, అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అన్నారు.

జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో (Government offices) ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించినట్లుగానే ఈ శనివారం వరకు అన్ని మండల కార్యాలయాలలో సైతం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయాలను శుభ్రంగా ఉంచడంతోపాటు, పిచ్చి మొక్కలు తొలగించాలని, చెత్తా, చెదారం, పోస్టర్లు వంటివి తీసివే యాలని, ఎలక్ట్రిక్ వైర్లు సరిచే యాలని, టాయిలెట్లు శుభ్రం గా ఉంచాలని, ప్రతి కార్యా లయం లో తప్పనిసరిగా తాగునీరు ఉంచా లని సోమవారం రోజు ప్రజావాణి అనంతరం మండ ల స్థాయి అధికార బృందాలు ప్రతి కార్యాలయాన్ని తనిఖీ (checking)చేయాలని ఆదేశించారు .జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లా డుతూ ఎక్కడైనా అటవీ భూము లు అన్యాక్రాంతం అవుతుంటే తమకు సమాచారం అందిస్తే పోలీసు నుండి అవస రమైన సహకారాన్ని అందజేస్తా మని, ప్రభుత్వ భూముల పరిరక్షణ చాలా ముఖ్యమని అన్నారు. ఎస్డి పిఓలు సీఐ లు, ఎస్సైలు ఇసుక అక్రమ రవాణా, అలాగే అటవీ భూముల అన్యాక్రాంతంకు సంబం ధించి సమాచారం అందిన వెంటనే స్పందించాలని, వాటిని అన్యా క్రాం తం కాకుండా ఆపాలని అన్నా రు. ఎక్కడైనా ఇసుక విషయంలో సమస్య ఉన్నట్లయితే స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం సమాచారం ఇచ్చి వారి భాగ స్వామ్యంతో సమస్యను పరిష్క రించేందుకు చూడాలని అన్నారు. కొత్త చట్టాలు అమలు లోకి వచ్చి నందున పోలీస్ అధికారులు అం దరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ మొక్కలు నాటడం పై సలహాలు, సూచనలు అందజేశారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచం ద్ర ,డిఆర్డిఓ నాగిరెడ్డి, జెడ్పి సీఈవో ప్రేమ్ కరన్ రెడ్డి, రెవెన్యూ పోలీస్, అటవీశాఖ అధికారులు, మండలా ల నుండి ఆర్డీవోలు, తహసిల్దారు లు ,ఎంపీ డీవోలు, పోలీసు, అటవీ శాఖ అధి కారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధి కారులు, సిబ్బంది, తదిత రులు ఈ వీడియో కాన్ఫరెన్స్ (Video conference)కు హాజరయ్యారు.