–అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్య యనం నిమిత్తం వారం పాటు 21 మంది సివిల్ సర్వీస్ ప్రోబేషనరీ అధికారుల బృందం
–ఈ నెల 21 నుండి 28 వరకు గ్రామాలలో పర్యటన
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం అధ్యయనా నికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్ట ర్ సి. నారాయణ రెడ్డి (Narayana Reddy) తెలిపారు.నల్గొండ జిల్లా లో అమలు చేస్తున్న వివిధ అభివృ ద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనం నిమిత్తం సివిల్ సర్వీసెస్ ప్రొబిషన రీ అధికారుల (Civil Services Prohibition of Officers)బృందం జిల్లాలో వారం రోజులపాటు పర్యటించ నున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి (Narayana Reddy)తెలిపారు.సివిల్ సర్వీ సెస్ ప్రొబేష నరీ అధికారుల బృం దం జిల్లా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు పై ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో టెలి కాన్స్ నిర్వహిం చారు.ఈ నెల 21 నుండి 28 వరకు 8 రోజులపాటు జిల్లాలోని పీఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెం, చింతపల్లి మండలం జర్పులతం డా, దేవర కొండ మండలం కర్నాటిపల్లి, కొండమల్లేపల్లి మండలం ఇస్లావత్ తాండ, పెండ్లిపాకల గ్రామాలలో ఈ అధికారుల బృందం పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయం చేయనున్నట్లు తెలి పారు. ఈ బృందంలో 21 మంది అధికారులు ఉన్నారని, డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవనుల అభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు రానున్నారని కలెక్టర్ చెప్పారు. .
ఒక్కో గ్రామానికి ఐదు మంది చొప్పున కేటాయించడం జరిగిం దని, సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం అధ్యయనా నికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ఆయా గ్రామాల ప్రొఫైల్ తో పాటు, గ్రామా లలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తయారు చేయాలని, అన్ని విష యాలపై వారికి తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. సివిల్ సర్వీస్ ప్రొబేషనరీ అధికారుల బృందం (Civil Services Prohibition of Officers) 21 నుండి 24 నుండి వారికి కేటాయించిన గ్రామాలలోనే బసచేస్తారని,25 న అదే మండలం మేజర్ గ్రామపంచాయతీలో అధ్యయనం చేస్తారని, 26 ,27 తేదీలలో దేవరకొండ, నాగార్జు నసాగర్ మున్సిపాలిటీ లలో అధ్యయనం చేస్తారని తెలిపారు. అందువలన వారికి అవసరమైన వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు,పాట్లు లేకుండా చూసుకోవాలని అన్నారు.28 న జిల్లా కేంద్రానికి వచ్చి తనతో సమావేశం అవుతారని , ఈ బృందానికి నోడల్ అధికారులుగా జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ మరియు డి ఆర్ డి ఓ (D.R.D.O) ఉంటారని, ఆర్డీవోలు, సంబంధిత మండలాల ఎంపీడీవోలు, తహసిల్దారులు, అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, జిల్లా అధికారులు, ఆర్డీవోలు , మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీ వోలు, తదితరులు ఈ టెలి కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.