Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ప్రధాన ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పెంచాలి

–ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
–డ్యూటీ సమయంలో ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రులలో పని చేస్తే డాక్టర్ పై చర్యలు
–సదరు సంబంధిత ఆసుపత్రులపై సైతం చర్యలు తప్పవు
–అవసరమైతే అలాంటి ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేస్తాం
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు వీలైనన్ని మరిన్ని మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) ఆసుపత్రి వైద్యులతో కోరారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పని తీరుపై సమీక్షిం చారు.జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరో గ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని రకాల రోగులను ఆరోగ్యశ్రీ (Arogyashri) కింద చూడాలని, ఏ ఒక్క విభాగం నుండి రోగిని చూడలేదన్నమాట రాకుండా సేవలందించాలని అన్నారు.

ప్రత్యేకించి ప్రభుత్వ ప్రధానాస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆసుపత్రిలో చూసినట్లుగానే చికిత్స అందించాలని , ఆస్పత్రి ప్రవేశంలోనే వారికి అవసరమైన సహాయం చేసేందుకు ప్రత్యేకించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ,ఇందుకుగాను ఇద్దరు మనుషులను ఏర్పాటు చేయాలని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రికి పంపించకూడదని ,ఒకవేళ అలా పంపించినట్లయితే సంబంధిత డాక్టర్, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ పై చర్య తీసుకుంటా మని హెచ్చరించారు . అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల (Private hospitals) నుండి రోగం బాగా ముదిరిన తర్వాత చివరి క్షణాల లో ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని ,అలా ఎవరైనా పంపించినట్లయితే సంబంధిత ప్రైవేట్ ఆస్పత్రి పై సైతం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డ్యూటీ సమయంలో ప్రభుత్వ డాక్టర్లు ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లయితే ఆ డాక్టర్ పై చర్య తీసుకోవడమే కాకుండా, సంబంధిత ప్రైవేట్ ఆస్పత్రి పై సైతం కఠిన చర్యలు తీసుకుంటా మని, అవసరమైతే అలాంటి ఆస్పత్రులను సీజ్ చేస్తామని హెచ్చ రించారు.

ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రులు (Private hospitals) డాక్టర్లను నియమిం చుకునే సమయంలో జాగ్రత్తగా పరిశీలించి తీసుకో వాల ని, వీలైతే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డిసిహెచ్ఎ స్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DCHA’s, District Me dical Health Officer) లతో సంప్రదించి నియమించు కోవాలని చెప్పా రు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, అటెం డెన్స్ విషయంలో కఠినంగా వ్యవహరిం చాలని, సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావా లని, వీలైనంతవరకు ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చూడాలని చెప్పారు.

ఆస్పత్రిలో (hospitals) ఉన్న సమస్యలను అధిగమిస్తూ ముందు కెళ్లాలన్నారు.ఆయా విభాగాలలో పని ఒత్తిడిని బట్టి సిబ్బందిని సర్దుబాటు చేయాలని, అందరూ టీం వర్క్ (team work)గా పని చేయాలని తెలిపారు.ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందేందుకు ప్రజలు ఆధార్ కార్డు తో పాటు , తెల్ల రేషన్ కార్డు , ఆహార భద్రత కార్డు, ఒకవేళ హెల్త్ కార్డు ఉన్నట్లయితే హెల్త్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, పై కార్డులలో రోగి పేరు తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు.

ఆయా విభాగాల వారీగా అధిపతు లతో పనితీరును, సమ స్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సమస్య లన్నిటిని దశల వారీగా పరిష్క రిస్తా మని, అందుబా టులో ఉన్న వనరులతో పనితీరు మెరుగుప రిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, ప్రధాన ఆస్పత్రి పర్య వేక్షకులు నిత్యానంద్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజకుమా రి, ప్రభుత్వ ప్రధానాస్పత్రి విభాగాల అధిపతులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు