Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: వసతి గృహం విద్యార్థులకు సొంతింటిలా ఉండాలి

–హాస్టల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, భోజ నం, సకల సౌకర్యాలు కల్పించాలి
–వసతి గృహాల అధికారులకు తల్లి కున్నంత ఓర్పు ఉండాలి
–విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ:ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యనభసించే విద్యార్థులు (students) అందరూ దారిద్ర్య రేఖకు దిగువనున్న వారే ఉంటారని హాస్టల్ వార్డెన్ (Hostel Warden) గా పనిచేసే అధికారు లకు తల్లికున్నంత ఓపిక ఉండాలని జిల్లా కలెక్ట ర్ సి.నారాయణరెడ్డి అన్నారు.

బుధవారం అయన జిల్లా కలెక్టర్ (District Collector) కార్యాలయావరణలో ఉన్న ఉద యాదిత్య భవన్లో అన్ని సంక్షే మ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యా రు.

హాస్టల్లను సరైన విధంగా నిర్వ హించాలని, హాస్టళ్లలో కనీస సౌక ర్యాలు ఉండేలా చూడాలని, ఎక్కడ తాగునీటి కలుషితం లేకుండా చూ సు కోవాలని, అదేవిధంగా ప్రభు త్వం నిర్దేశించిన ప్రకారం వంట సామాగ్రి సరఫ రా చేస్తున్నది, లేని ది చూడాలని, అన్ని హాస్టళ్లలో నిర్దే శించిన ప్రకారం సీట్లు భర్తీ చేయాలని ,ఎక్కడైనా హాస్టల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు.

హాస్టల్ ఇల్లు లాంటిది. హాస్టల్ నిర్వహణ చాలా కష్టతర మైన ప్పటికీ ప్రభుత్వం పేద విద్యా ర్థులకు సేవ చేసే భాగ్యాన్ని మనంద రికి కల్పించింది. ప్రభుత్వ మిచ్చిన అన్ని సౌకర్యాలు కల్పించి వారిని బిడ్డల్లాగా చూసుకోవాలి”. అని కలెక్టర్ చెప్పారు.

జిల్లాలో హాస్టళ్ళు, కేజీబీవీలు, మోడల్ స్కూల్ (KGBVs, Model School) లలో ఎలాంటి అవాంఛనీ య సంఘటన లు జరిగినట్లు తన దృష్టికి రాకూడదని, ఎట్టి పరిస్థితు లలో హాస్టల్ (hostel) నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, భోజనం విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని, హాస్టళ్లలో ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మ తులు ఉంటే తక్షణమే చేయించాలని, సాధ్యం కానివి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

అదే సమయంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన చదువును అందించా ల్సిన బాధ్యత హాస్టల్ అధికారు లు, పాఠశాల అధికారుల పై ఉంద ని , పనిచేసే అధికారులు, సిబ్బంది వెనక తాము ఎప్పుడు అండగా ఉంటామని, ఎట్టి పరిస్థి తులలో తప్పులకు ఆస్కారం లేకుండా పనిచేయాలని, అందరూ కలిసి పనిచేద్దామని అని పిలుపు నిచ్చారు.

ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తా మని, ఆ విధంగా విద్యార్థులను తీర్చిది ద్దాలని, హాస్టళ్లలో సమ స్యలను తొలగిస్తా మని, అవసరమైన సౌకర్యాలని కల్పిస్తామని, తద్వారా వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తా మని, తాగునీటిపైన ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, హాస్టళ్ళు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ స్కూల్ ((KGBVs, Model School))లకు నాణ్యమైన బియ్యం వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు.

తాగునీరు, శానిటేషన్ సమస్యలు (Drin king water and sanitation issues)లేకుండా పరిష్కరిస్తా మని,అలాగే తక్కిన విషయాలపై సైతం జిల్లా అధికారులు తనకు దృష్టికి తీసు కొస్తే పరి ష్కరిస్తానని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఇంచార్జ్ అధికారులు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వర రావు,హోసింగ్ పి డి రాజ్ కుమార్,డి ఈ ఓ భిక్షపతి,. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు,కెజిబివి పాఠశాలలు,మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్,తదితరులు హాజరయ్యారు.