ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : 2019- 2020 సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నందు యాదాద్రి భువనగిరి జిల్లా నేషనల్ యూత్ వాలంటరీగా ఎంపికై, ఎన్నో యువజన సంఘాలు ఏర్పాటుచేసి యువతకు అన్ని విషయాలు తెలియపరుస్తూ, యువత ఏ విధంగా ఉండాలి అనే విషయాలపై మంచి సమాచారం అందిస్తూ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని, నేడు న్యూఢిల్లీలో పంచశీల ఆశ్రయం మురారి బైపాస్ నందు భారతీయ దళిత సాహిత్య అకాడమీ నేషనల్ అధ్యక్షులు సమనక్షర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం నుండి యాదాద్రి నేషనల్ ఫెలోషిప్ అవార్డు రావడం నేషనల్ సోషల్ వర్కర్ గా ఇవ్వడం జరిగింది.అతను మాట్లాడుతూ ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషమని తన మాటల్లో తెలిపారు.