ప్రజదీవెన, నల్గొండ టౌన్ : జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాలతో జిల్లా జడ్జి మరియు చైర్మన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఎం. నాగరాజు, జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని కోర్ట్ ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడింది.
ఈ లోక్ అదాలత్ లో 72 సివిలు, 4787 క్రిమినలు,86 మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, 9 బాంక్ కేసులు, 15 సైబర్ క్రైమ్ కేసులు, 230 ట్రాన్స్కో, 9251 ట్రాఫిక్ చాలాన్ కేసులు, మొత్తం 144358 (పెండింగ్ మరియు ప్రి-లిటిగేషన్) కేసులు పరిష్కరించబడినవి. ఇందులో ప్రమాద భీమా కేసులలో రూ. 40938000 నష్టపరిహారం ఇప్పించగ, రూ. 3,55,000 బ్యాంక్ కేసులలో రుణపరిహారం ఇప్పించడము మరియు సైబర్ క్రైమ్ కేసులో రికవరీ డబ్బులు రూ.1,14,385 జరిగింది.
ఈ కార్యక్రమములో జిల్లా జడ్జి మరియు చైర్ పర్సన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఎం. నాగరాజు, మూడవ అదనపు జిల్లా జడ్జి శ్రీ డి.దుర్గ ప్రసాద్, నాల్గవ అదనపు జిల్లా జడ్జి కె . కవిత, కార్యదర్శి/సీనియర్ సివిల్ జడ్జి శ్రీ డి.వి.ఆర్.తేజోకార్తీక్, మెజిస్ట్రేట్ శిరీష, మేజిస్ట్రేట్ సౌందర్య, బార్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వెంకట్ రెడ్డి, లింగయ్య గౌడ్ , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ ఎన్ .భీమార్జున్ రెడ్డి, ఎం లెనిన్ బాబు, టి. వి ప్రసాద్, పానెల్ అడ్వొకేట్లు మరియు ఇతర న్యాయవాదులు నల్లగొండ పాల్గొన్నారు.